పది గ్రాముల పసిడి ధర రూ.26,810కి చేరింది

- October 03, 2015 , by Maagulf
పది గ్రాముల పసిడి ధర రూ.26,810కి చేరింది

వరుసగా గత ఐదు రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర ఈ రోజు ఒక్కసారే రూ.660 పెరిగింది. ఈ ఏడాది మొత్తంలో ఒక్క రోజులో ఇంత ఎక్కువ పెరగడం ఇదే మొదటి సారి. ఈ భారీ పెరుగుదలతో 99.9 స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ.26,810కి చేరింది. అమెరికా భత్యాలు పెంచడం, ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను పెంచనుందన్న వార్తలతో బంగారం ఒక్కసారిగా పెరిగిందని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు తెలిపాయి.బంగారం ప్రభావం వెండి ధరపైనా పడింది. ఈ ఒక్కరోజే రూ.1200 పెరగడంతో కేజీ వెండి ధర రూ.35,800కు చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఈ లోహం ధర సైతం పెరిగిందని మార్కెట్‌ వర్గాలు తెలిపాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com