మేడం టుసాడ్స్‌ మ్యూజియంలో కపిల్‌ దేవ్ విగ్రహం

- April 27, 2017 , by Maagulf
మేడం టుసాడ్స్‌ మ్యూజియంలో కపిల్‌ దేవ్ విగ్రహం

లెజెండరీ క్రికెటర్‌ కపిల్‌ దేవ్‌కు అరుదైన గౌరవం దక్కనుంది. ఢిల్లీలోని ప్రఖ్యాత మేడం టుసాడ్స్‌ మ్యూజియంలో కపిల్‌ మైనపు ప్రతిని చేర్చనున్నారు. దాంతో, ఇప్పటికే ఆ మ్యూజియంలో ప్రతిమలు ఉన్న ఇతర క్రికెట్‌ దిగ్గజాల సరసన కపిల్‌ చేరనున్నాడు. ఈ సందర్భంగా మాట్లాడిన కపిల్‌.. 'ఈ మ్యూజియంలో లెజెండ్స్‌ సరసన చేరుతున్నందుకు గౌరవంగా భావిస్తున్నా. నా మైనపు బొమ్మను చూసేందుకు ఆతృతగా ఉన్నాన'ని చెప్పాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com