నిజాంపేట లో 'బాహుబలి' బృందం సందడి
- April 27, 2017
సినీ ప్రేక్షకలోకం రెండేళ్లుగా ఎప్పుడెప్పుగా అని ఎదురుచూస్తున్న వెండితెర దృశ్యకావ్యం ‘బాహుబలి-2’ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ బాహుబలి ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది.. ఈరోజు ఉదయం కూకట్పల్లి లోని శ్రీ భ్రమరాంబ థియేటర్ వద్ద బాహుబలి బృందం సందడి చేసింది. దర్శకుడు రాజమౌళి, ఆయన భార్య రమ, హీరోయిన్ అనుష్క, కీరవాణి దంపతులు, ఇతర బృంద సభ్యులు థియేటర్లో ప్రేక్షకులతో కలిసి చిత్రాన్ని వీక్షించారు. టిక్కెట్ల కోసం థియేటర్ వద్ద బారులు తీరిన ప్రేక్షకులు చిత్ర బృందాన్ని చూసి ఆనందానికి గురయ్యారు. కొందరు రాజమౌళి వద్దకు వెళ్లి కరచాలనం చేశారు.
తాజా వార్తలు
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం









