జిసిసి ప్రయాణీకులకు జెట్‌ ఎయిర్‌వేస్‌ ఆఫర్లు

- April 28, 2017 , by Maagulf
జిసిసి ప్రయాణీకులకు జెట్‌ ఎయిర్‌వేస్‌ ఆఫర్లు

మూడు రోజుల వెబ్‌ బేస్డ్‌ సేల్‌ ఆఫర్‌ని ఇండియన్‌ ఎయిర్‌లైన్‌ జెట్‌ ఎయిర్‌ వేస్‌ ప్రకటించింది. జిసిసి ప్రయాణీకుల కోసం 12 శాతం ఫ్లాట్‌ డిస్కౌంట్‌తో టిక్కెట్లను అందుబాటులోకి తెచ్చింది. 'పే డే ప్రోమో' పేరుతో జెట్‌ ఎయిర్‌వేస్‌ వెబ్‌సైట్‌లో మొబైల్‌ యాప్‌ ద్వారా ఈ టిక్కెట్లను బుక్‌ చేసుకోవచ్చు. ఏప్రిల్‌ 29 నుంచి మే 1 వరకు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది. ముందుగా వచ్నివారికి ముందుగా అనే ప్రాతి పదికన ఈ ఆఫర్‌ ప్రకటించారు. టిక్కెట్లను ఏప్రిల్‌ 1 నుంచి మే 1 వరకు కొనుగోలు చేసినా, ఆ తర్వాతి కాలంలో ఎప్పుడైనా వాటిని వినియోగించుకోవచ్చు. ఇండియాతోపాటుగా బ్యాంకాక్‌, హాంగ్‌కాంగ్‌, సింగపూర్‌, కొలంబో, ఢాకా మరియు కాఠ్మండులకూ ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com