శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కేజీ బంగారం స్వాధీనం
- April 28, 2017
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం కస్టమ్స్ అధికారులు శుక్రవారం ముగ్గురు వ్యక్తుల నుంచి 1.23 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అమెరికా, అబుదాబి నుంచి వచ్చి న ఈ ముగ్గురిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరి నుంచి స్వాధీనం చేసుకున్న బంగా రం విలువ మార్కెట్లో రూ. 36.09 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. పసిడిని రవాణా చేసిన విధానం, తీసుకువచ్చిన ప్యాసింజర్ల ప్రొఫైలింగ్ ఆధారంగా ఇది వ్యవస్థీకృత స్మగ్లింగ్ కాకపోవచ్చని, వ్యక్తిగత అవసరాల కోసమే తెచ్చుకుని ఉండవచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
అమెరికా నుంచి అబుదాబి మీదుగా వచ్చే విమానం లో శంషాబాద్ చేరుకున్న ఓ వ్యక్తి 342 గ్రాముల 24 క్యారెట్ల బంగారాన్ని 8 కడియాల రూపంలో తీసుకువచ్చాడు. అబుదాబి నుంచి వచ్చిన విమానంలో దిగిన ఇద్దరిలో ఒకరు 387 గ్రాముల బంగారాన్ని రెండు గొలుసుల రూపంలోనూ, మరొకరు 507 గ్రాముల బంగారాన్ని గాజుల రూపంలోనూ తీసుకొచ్చారు.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







