యాక్సిడెంట్‌లో నటి రేఖ సింధు మృతి

- May 05, 2017 , by Maagulf
యాక్సిడెంట్‌లో నటి రేఖ సింధు మృతి

మోడల్, నటి రేఖ సింధు రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఓ షూట్ నిమిత్తం శుక్రవారం ఉదయం చెన్నైకి బయలుదేరిన ఈమె, చెన్నై- బెంగుళూరు జాతీయ రహదారి పెర్నంబూట్‌కి సమీపంలో ఈ ఘోరం జరిగింది. రేఖతోపాటు మిగతా ముగ్గురు అక్కడే చనిపోయారు. మృతులు అభిషేక్, జయన్‌కంద్రన్‌, రక్షణ్‌లుగా పోలీసులు గుర్తించారు.
ఘటన జరిగిన సమయంలో కారులో ఆరుగురు వున్నట్లు తమిళనాడు పోలీసులు చెబుతున్నారు. డ్రైవర్ నిద్రపోవడంతో ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన రేఖ సింధు.. తమిళం, కన్నడ టీవీ ఆడియెన్స్‌కు మరింత దగ్గరైంది. ఫామ్‌లో వుండగానే మృతి చెందడం అభిమానులు జీర్ణించుకోలేపోతున్నారు. ఇటు రేఖ ఇంట్లో విషాధం నెలకొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com