రాజధాని శంకుస్థాపనకు సిద్ధం
- October 05, 2015
ఈనెల 22న జరిగే రాజధాని అమరావతి శంకుస్థాపనకు అధికారులు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేపట్టారు. మొత్తం 16 హెలికాప్టర్లు, 9 హెలిప్యాడ్లను సిద్ధం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి వచ్చే నేతలు గన్నవరం నుంచి హెలికాప్టర్లో శంకుస్థాపన ప్రాంతానికి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. 250 ఎకరాలను రాజధాని శంకుస్థాపనకు సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. శంకుస్థాపన కోసం అధికారులు ఉద్దండరాయునిపాలెంలో భూమిని ఖరారు చేశారు. 50 ఎకరాల్లో బహిరంగ సభను ఏర్పాటు చేసి లక్షమంది కోసం చూసేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఈ సభలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, సింగపూర్, జపాన్ మంత్రులు ప్రసంగించనున్నారు. అలాగే గుంటూరు, విజయవాడ నుంచి రహదారుల వెడల్పు చేసి ఉద్దండరాయునిపాలెంకు రహదారులను అనుసంధానం చేయనున్నారు.
తాజా వార్తలు
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!







