రాజధాని శంకుస్థాపనకు సిద్ధం
- October 05, 2015
ఈనెల 22న జరిగే రాజధాని అమరావతి శంకుస్థాపనకు అధికారులు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేపట్టారు. మొత్తం 16 హెలికాప్టర్లు, 9 హెలిప్యాడ్లను సిద్ధం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి వచ్చే నేతలు గన్నవరం నుంచి హెలికాప్టర్లో శంకుస్థాపన ప్రాంతానికి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. 250 ఎకరాలను రాజధాని శంకుస్థాపనకు సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. శంకుస్థాపన కోసం అధికారులు ఉద్దండరాయునిపాలెంలో భూమిని ఖరారు చేశారు. 50 ఎకరాల్లో బహిరంగ సభను ఏర్పాటు చేసి లక్షమంది కోసం చూసేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఈ సభలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, సింగపూర్, జపాన్ మంత్రులు ప్రసంగించనున్నారు. అలాగే గుంటూరు, విజయవాడ నుంచి రహదారుల వెడల్పు చేసి ఉద్దండరాయునిపాలెంకు రహదారులను అనుసంధానం చేయనున్నారు.
తాజా వార్తలు
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!







