ఒమనైజేషన్తో నిర్మాణ రంగం కుదేలు
- October 05, 2015
నిర్మాణ రంగంలో 30 శాతం రిజర్వేషన్ స్థానికులకు కల్పించాలంటూ తీసుకున్న నిర్ణయంపట్ల నిర్మాణ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 30 శాతం ఒమనియన్లకే అవకాశాలు ఇవ్వాలన్న నిబంధన సరికాదనీ, ఈ నిబంధన ద్వారా తగినంతమంది స్థానిక కార్మికులు అందుబాటులో ఉండరని నిర్మాణ రంగంలోని ప్రముఖులు వెల్లడించారు. తాజా నిబంధనతో విదేశాల నుంచి కార్మికుల్ని తెచ్చుకోవడం కష్టమవుతుందనీ, స్వదేశంలోని కార్మికులు 6 నెలల కంటే ఎక్కువ కాలం తమతో కలిసి పనిచేయలేరని తద్వారా నిర్మాణ రంగం రానున్న రోజుల్లో తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కోనుందని ఓ కాంట్రాక్టర్ వెల్లడించారు. ప్రస్తుత నిబంధన ఒక దేశం నుంచి ఎక్కువమంది కార్మికుల్ని తీసుకురావడానికి అనుమతించదనీ, ప్రస్తుతం కేవలం 10 శాతం మంది మాత్రమే బంగ్లాదేశ్ నుంచి తీసుకోవడానికి అవకాశముందనీ, ఈ నిబంధనతో కార్మికుల కోసం ఇబ్బందులు తప్పవని యునైటెడ్ డ్రీమ్స్ ఎల్ఎల్సి కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ మహమమద్ కబీర్ అహ్మద్ చెప్పారు. పాలకులు వీలైనంత త్వరగా ఈ నిబంధన సడలించకపోతే నిర్మాణ రంగం సంక్షోభంలో పడక తప్పదని కొందరు కాంట్రాక్టర్లు అంటున్నారు.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!







