మంజుల దర్శకత్వంలో సందీప్

- May 10, 2017 , by Maagulf
మంజుల దర్శకత్వంలో సందీప్

నటిగా, నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న మహేశ్‌బాబు సోదరి మంజుల ఘట్టమనేని ఇప్పుడు దర్శకురాలిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సందీప్‌ కిషన్‌ హీరోగా ఆమె దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. బుధవారం ఈ చిత్రం పూజా కార్యక్రమాన్ని నిర్విహించినట్లు మంజుల ఫేస్‌బుక్‌ ద్వారా ప్రకటించారు. మే 20 నుంచి షూటింగ్‌ ప్రారంభం కానుందని తెలిపారు. ఆనంది ఇందిరా ప్రొడక్షన్‌ పతాకంపై చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. అమైరా దస్తర్‌, త్రిధా చౌదరి కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి రాధన్‌ స్వరాలు సమకూరుస్తున్నట్లు మంజుల తెలిపారు. .

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com