ఘనంగా జరిగిన టీఆర్‌ఎస్‌-యూఎస్‌ఏ నేషనల్ కాన్ఫరెన్స్

- May 15, 2017 , by Maagulf
ఘనంగా జరిగిన టీఆర్‌ఎస్‌-యూఎస్‌ఏ నేషనల్ కాన్ఫరెన్స్

కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీలో టీఆర్‌ఎస్‌-యూఎస్‌ఏ బే ఏరియా శాఖ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ యూఎస్‌ఏ రెండవ జాతీయ సదస్సును ఘనంగా నిర్వహించారు. అమరులకు నివాళులు అర్పించి, ప్రొ. జయశంకర్, రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ విద్యాసాగర్ రావుకి శ్రద్ధాంజలి ఘటించారు. తెలంగాణ రాష్ట్ర గీతం ఆలపించి సభను ప్రారంభించారు.

స్థానిక టీఆర్‌ఎస్‌ యూఎస్‌ఏ నాయకులు పూర్ణ బైరి సభకు అధ్యక్షత వహించారు. ఎంపీ. కల్వకుంట్ల కవిత చేతుల మీదగా టీఆర్‌ఎస్‌-యూఎస్‌ఏ ప్రారంభై, రెండవ నేషనల్ కాన్ఫరెన్స్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని పూర్ణ బైరి అన్నారు. టీఆర్‌ఎస్‌-యూఎస్‌ఏ వ్యవస్థాపకులు మహేష్ తన్నీరు, టీఆర్‌ఎస్‌ ఎన్నారై విభాగాల కోర్డినేటర్ బిగాల మహేష్ గుప్త, నాగేందర్ మహీపతిలు, రజినీకాంత్ కూసానం, నవీన్ కానుగంటి రూపొందించిన టీఆర్‌ఎస్‌-యూఎస్‌ఏ లోగో, తక్కళ్లపల్లి అరవింద్ రూపొందించిన ఫేస్ బుక్ పేజీను ఆవిష్కరించారు. భారీగా హాజరైన సభికులను ఉద్దేశించి వ్యవస్థాపకులు తన్నీరు మహేష్ ప్రసంగించారు. ప్రభుత్వం అమలుపరుస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలను టీఆర్‌ఎస్‌-యూఎస్‌ఏ ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని కోరారు. కొత్త రాష్ట్రమైన తెలంగాణ కేసీఆర్‌ నాయకత్వంలో ప్రగతిబాటలో పురోగమిస్తూ, వివిధ రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు. అనంతరం గులాభి కండువా కప్పి పలువురు ఎన్నారైలను టీఆర్‌ఎస్‌ అమెరికా శాఖలోకి ఆహ్వానించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com