భారత్, పాకిస్తాన్ జాతీయులకు ఇళ్లను అద్దెకివ్వను
- May 18, 2017
భారత్, పాకిస్తాన్ జాతీయులకు తన ఇళ్లను అద్దెకు ఇవ్వనని బ్రిటిష్ సంపన్నుడు ఫెర్గూస్ విల్సన్ చెబుతున్నాడు. దీనిపై వివాదం రేగినా, న్యాయపర చర్యలు తీసుకునే అవకాశమున్నా ఆయన వెనక్కి తగ్గడం లేదు. ‘వారు ఇళ్లు ఖాళీ చేశాక భారతీయ వంటకాల వాసన వస్తుంది. మళ్లీ కార్పెట్లు వేయడానికి ఖర్చవుతుంది..అందుకే వారికి ఇళ్లను అద్దెకు ఇవ్వను. ఇది వారి శరీర వర్ణానికి సంబంధించిన సమస్య కాదు, కూర(కర్రీ)కు సంబంధించిన సమస్య..’ అని వాదిస్తున్నాడు.
వెయ్యికిపైగా ఇళ్లున్న ఫెర్గూస్ భారతీయులపై విధించిన ఈ నిషేధాన్ని బ్రిటన్ మానవ హక్కుల సంస్థ ఈక్వాలిటీ అండ్ హ్యూమన్ రైట్స్ కమిషన్(ఈహెచ్ఆర్సీ) కోర్టులో సవాలు చేసింది. విల్సన్ నిర్ణయాన్ని నిలిపేస్తూ ఆదేశాలివ్వాలని సెంట్రల్ లండన్ కౌంటీ కోర్టును కోరామని సంస్థ ప్రతినిధి రెబెక్కా హిల్సెన్రథ్ తెలిపారు. భారత్, పాక్ జాతీయులకు ఇళ్లను కిరాయి ఇవ్వొద్దంటూ ఫెర్గూస్ తన ఏజెంట్లకు పంపిన ఈమెయిల్స్ లీక్ కావడంతో వివాదం రేగింది.
తాజా వార్తలు
- షార్జాలో పర్యాటక రంగానికి భారీ ఊరట..!!
- ఇంట్లోనే అక్రమంగా రెస్టారెంట్..పలు ఉల్లంఘనలు నమోదు..!!
- ఒమన్–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం.. సముద్ర భద్రతపై కీలక చర్చలు..!!
- AP ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మేకోవర్ చైర్ పర్సన్ గా మేరుగు తనూజ నియామకం
- ఫేక్ డిగ్రీతో టీచర్ ఉద్యోగం.. ప్రవాసికి 6 నెలల జైలుశిక్ష..!!
- లైసెన్స్ లేకుండా అకౌంటింగ్ సేవలు.. రెండు సంస్థలు, మాజీ అకౌంటెంట్పై చర్యలు..!!
- దివ్యాంగులు, ఆటిజం పిల్లలకు శుభవార్త.. ఖతార్ లో విద్యా వౌచర్ పథకం విస్తరణ..!!
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!







