కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి అనిల్ మాదవ్ దవే మృతి
- May 18, 2017
కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి అనిల్ మాదవ్ దవే హఠాన్మరణం చెందారు. 1956, జులై 6న మధ్యప్రదేశ్లోని బాద్నగర్లో ఆయన జన్మించారు. 2009 నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. గతేడాది జులైలో కేంద్ర కేబినెట్ విస్తరణలో భాగంగా.. దవేను పర్యావరణ, అటవీ శాఖ మంత్రిగా నియమితులయ్యారు. అనిల్ దవే మృతిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిన్న సాయంత్రం వరకు దవేతో తాను మాట్లాడనని, ఎన్నో ముఖ్యమైన విషయాలు చర్చించుకున్నామని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఆయన ఇకలేరనే వార్త వ్యక్తిగతంగా తనను ఎంతగానో వేదనకు గురిచేస్తోందన్నారు. దవే మృతి పట్ల కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, సురేశ్ ప్రభు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- షార్జాలో పర్యాటక రంగానికి భారీ ఊరట..!!
- ఇంట్లోనే అక్రమంగా రెస్టారెంట్..పలు ఉల్లంఘనలు నమోదు..!!
- ఒమన్–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం.. సముద్ర భద్రతపై కీలక చర్చలు..!!
- AP ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మేకోవర్ చైర్ పర్సన్ గా మేరుగు తనూజ నియామకం
- ఫేక్ డిగ్రీతో టీచర్ ఉద్యోగం.. ప్రవాసికి 6 నెలల జైలుశిక్ష..!!
- లైసెన్స్ లేకుండా అకౌంటింగ్ సేవలు.. రెండు సంస్థలు, మాజీ అకౌంటెంట్పై చర్యలు..!!
- దివ్యాంగులు, ఆటిజం పిల్లలకు శుభవార్త.. ఖతార్ లో విద్యా వౌచర్ పథకం విస్తరణ..!!
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!







