ఫిషర్మెన్కి 2 మిలియన్ దిర్హామ్లు చెల్లించాలని రూలర్ ఆదేశం
- May 18, 2017
షార్జా రూలర్, సుప్రీం కౌన్సిల్ మెంబర్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ ఖాసిమి, ఫిషర్మెన్ కోసం 2 మిలియన్ దిర్హామ్ చెల్లించాలని యూఏఈలోని అతి పెద్ద తాజా ప్రోడక్ట్స్ మార్కెట్ సౌక్ అల్ జాబిలి మేనేజ్మెంట్ని ఆదేశించారు. మొత్తం 236 ఎమిరేటీ ఫిషర్మెన్కి ఈ మొతాన్ని రమదాన్ మాసం సందర్భంగా చెల్లించాల్సి ఉంటుంది. షార్జా ఎస్సెట్స్ మేనేజ్మెంట్ సిఇఓ అల్ సయెగ్తో టెలిఫోన్ సంభాషణ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫిషర్మెన్ సమస్యల్ని షార్జా రూలర్ సానుకూలంగా పరిశీలించి, పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు అల్ సయెగ్. అలాగే ఈ సంస్థ, ఫిషర్ మెన్ నుంచి సర్ప్లస్ ఫిష్ని కొనుగోలు చేసి, ఎమిరేట్ వ్యాప్తంగా తమ సంస్థ ద్వారా విక్రయించాలనే నిర్ణయానికి వచ్చిందని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి నివాసంలో ఈడీ సోదాలు
- విజయవాడ ఎయిర్పోర్టులో విదేశీ ప్రయాణికులకు ఎబోలా పరీక్షలు
- బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులకు గవర్నర్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు
- పౌరులకు, నివాసితులకు సుల్తాన్ ఈద్ అల్ అదా శుభాకాంక్షలు..!!
- యాత్రికులకు రికార్డుస్థాయిలో మషాయిర్ మెట్రో సేవలు..!!
- ఆన్లైన్ బుకింగ్ మోసాలపై కువైట్ హెచ్చరిక..!!
- సీబీఎస్ఈ 12.. రీవాల్యుయేషన్ కు పెరుగుతున్న దరఖాస్తులు..కారణం ఇదేనా?
- ఖలాలీలో హయా బియా వేడుకలకు భారీ స్పందన..!!
- ఇరాన్ ప్రెసిడెంట్ తో చర్చలు జరిపిన అమీర్..!!
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!









