ఇది సమయం కాదంటూ ఫ్యాన్స్ని వారించిన బన్నీ
- May 31, 2017
ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు పార్థివదేహాన్ని హైదరాబాదులోని ఫిల్మ్ నగర్ లోని ఫిల్మ్ ఛాంబర్ లో అభిమానుల సందర్శనార్థం ఉంచిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో సినీ ప్రముఖులంతా దాసరిని కడసారి చూసేందుకు తరలి వచ్చారు. అల్లు అర్జున్ కూడా అక్కడికి చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో, అల్లు అర్జున్ ను అభిమానులు చుట్టుముట్టారు. అల్లు అర్జున్ ను తమ సెల్ ఫోన్లలో బంధించేందుకు వారంతా పోటీలు పడ్డారు. దీంతో బౌన్సర్లు అతనికి రక్షణ కల్పించారు. మరికొంతమంది అభిమానులు అల్లు అర్జున్కు అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో అల్లు అర్జున్ అభిమానులకు ఇది సమయంకాదంటూ హితవు పలికాడు. ఆపేయాలని వారికి సూచించాడు. దీంతో అభిమానులు శాంతించారు. అనంతరం ఆయన దాసరి పార్థివదేహాన్ని సందర్శించి వెళ్లిపోయారు.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









