పట్టాలెక్కనున్న మోనో రైల్‌

- October 10, 2015 , by Maagulf

దశాబ్ద కాలం క్రితం ప్లాన్‌ చేసిన మోనో రైల్‌ ప్రాజెక్ట్‌, ఇప్పుడు పట్టాలెక్కేలి కనిపిస్తోంది. 2008లో ప్రపంచ ఆర్థిక మాంద్యంతో ఈ ప్రాజెక్ట్‌ అటకెక్కింది. అయితే జిసిసి రైల్వేలో భాగంగా బహ్రెయిన్‌ మోనో రైల్‌ ప్రాజెక్ట్‌ని కూడా పట్టాలెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 22 కిలోమీటర్ల మేర లైట్‌ రైల్‌ నెట్‌ వర్క్‌ కోసం టెండర్లను ఆహ్వానించారు. రెండు లైన్లతో, 19 స్టేషన్లు కలిగి ఉంటుంది ఈ ప్రాజెక్ట్‌. 8 వేల మంది ప్రయాణీకుల సమర్థ్యంతో ఈ ప్రాజెక్ట్‌ని ప్లాన్‌ చేస్తున్నారు. మలేషియా సంస్థ షోమి ఇంజనీరింగ్‌ 2008లో 83 కిలోమీటర్ల ప్రాజెక్ట్‌ని, 20 ఏళ్ళలో కంప్లీట్‌ చేయాలనుకుంది. కానీ కొన్ని కారణాలతో అది ఆగిపోయింది. అయితే ఈసారి ఎలాంటి ఆటంకాలూ లేకుండా లైట్‌ లైర్‌ ప్రాజెక్ట్‌ (మోనో రైల్‌)ను అనుకున్న మేర పూర్తి చేస్తామని అధికారులు చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com