జెట్ ఎయిర్వేస్ మెంబర్స్ కోసం బోనస్ జెపి మైల్స్
- June 06, 2017
జెట్ ఎయిర్వేస్, జెట్ ప్రివిలేజ్ మెంబర్స్ కోసం సరికొత్త ఆఫర్ని తీసుకొచ్చింది. జూన్ 24 నుంచి బుక్ చేసుకునే టిక్కెట్లకు అత్యధికంగా మూడు రెట్ల బోనస్ జెపి మైల్స్ని అందించనుంది. ఒమన్ నుంచి వెళ్ళే ప్రయాణాలకు ఇది వర్తిస్తుంది. ఈ ఆఫర్ జెట్ ప్రివిలేజ్కి సంబంధించిన మెంబర్స్ అందరికీ వర్తిస్తుంది. ఈ ఆఫర్ కింద టిక్కెట్లు బుక్ చేసుకున్నవారు జూన్ 28 నుంచి డిసెంబర్ 6 మధ్యలో ప్రయాణించాల్సి ఉంటుంది. జెట్ ఎయిర్ వేస్ ఒమన్ జనరల్ మేనేజర్ వాసిమ్జైది మాట్లాడుతూ, ఫెస్టివ్ సీజన్, అలాగే స్కూల్ హాలీడేస్ నేపథ్యంలో ప్రయాణీకులకు అద్భుతమైన ప్రయాణానుభూతితోపాటు, ఆకర్షణీయమైన ఆఫర్లను అందించే క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. జెట్ ఎయిర్ వేస్ వెబ్సైట్ ద్వారా జెట్ ప్రివిలేజ్ ప్రోగ్రామ్లో తమ పేర్లను నమోదు చేసుకోవడానికి వీలుంది. ఆ వెంటనే జెపి మైల్స్ బోనస్ పాయింట్స్ని పొందవచ్చు.
తాజా వార్తలు
- యూఏఈ–ఒమన్ హఫీత్ రైల్ ప్రాజెక్ట్ 40% పూర్తి..!!
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు









