బ్రిటన్ ఎంపీల్లో 650 స్థానాలుకు 208 మంది మహిళలే
- June 10, 2017
బ్రిటన్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మహిళలు సత్తా చాటారు. మొత్తం 650 స్థానాలున్న బ్రిటన్ దిగువసభలో 208 స్థానాల్లో మహిళలు ఎంపీలుగా ఎన్నికయ్యారు. 2015లో జరిగిన ఎన్నికల్లోనూ 191 మంది మహిళలే గెలుపొందడం గమనార్హం. ఈ ఎన్నికల్లో 208 స్థానాల్లో మహిళలు గెలుపొందడం ద్వారా ఆ రికార్డును అధిగమించినట్లయింది. ఈ 208 మందిలో ఎక్కువగా కన్సర్వేటివ్, లేబర్ పార్టీల నుంచి మహిళలు ఉన్నారు. ప్రధాని థెరెసా మే నాయకత్వంలోని కన్సర్వేటివ్ పార్టీ 318 స్థానాలను కైవసం చేసుకుంది. జెరెమీ కోర్బిన్ నేతృత్వంలోని విపక్ష లేబర్ పార్టీకి 261 సీట్లు దక్కాయి. ఈ ఎన్నికల్లో లేబర్ పార్టీకి 29 స్థానాలు పెరగ్గా.. కన్సర్వేటివ్ పార్టీకి 13 సీట్లు తగ్గాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ సాధించకపోవడంతో థెరెసా.. ఉత్తర ఐర్లాండ్లోని డెమోక్రటిక్ యూనియనిస్టు పార్టీకి చెందిన 10మంది ఎంపీల సాయంతో ప్రభుత్వం ఏర్పాటు చేసే సూచనలున్నాయి.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









