పారామెడిక్స్ టీమ్ని సత్కరించిన సివిల్ డిఫెన్స్
- June 11, 2017
దుబాయ్ సివిల్ డిఫెన్స్, పారామెడిక్ టీమ్ని సత్కరించింది. అగ్ని ప్రమాదం కారణంగా కాలిపోతున్న ఓ భవనం నుంచి ముగ్గురు వ్యక్తుల్ని రక్షించే క్రమంలో వీరు ప్రదర్శించిన సాహసానికి గుర్తింపుగా ఈ సత్కారం జరిగింది. అల్ మనార్ ప్రాంతంలో గత నెలలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటలో దుబాయ్ కార్పొరేషన్ ఫర్ అంబులెన్స్ సర్వీసెస్ (డిఎసిఎస్)కి చెందిన పారామెడిక్స్ టీమ్, ఓ చిన్నారి, ఓ మహిళ సహా ముగ్గుర్ని ప్రాణాపాయం నుంచి రక్షించింది. దుబాయ్ సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ రషీద్ థని అల్ మత్రోషి ఈ సందర్భంగా పారామెడిక్స్ టీమ్ని ప్రశంసలతో ముంచెత్తారు. డ్రైవర్ జలాల్ అబాదీ, అగ్ని ప్రమాదం జరిగిన భవనంలోకి దూసుకెళ్ళి చిన్నారని తీసుకొచ్చారు. పారామెడిక్ నాజర్ అల్ మజ్రోకి, ఓ వృద్ధురాల్ని బయటకు తీసుకొచ్చారు.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









