ఖతార్ సమస్యపై భారత్కు గల్ఫ్ దేశాల హామీ
- June 11, 2017
గల్ఫ్ దేశాల్లో తలెత్తిన ఖతార్ సమస్యకు సంబంధించి ఆయా దేశాలు చర్చల ద్వారా పరిష్కారం వెతకాలని భారతదేశం చేసిన సూచన పట్ల ఆయా దేశాలు సానుకూలంగా స్పందించాయి. తమ దేశాల్లో ఉంటోన్న భారతీయులకు ఈ సమస్య కారణంగా ఎలాంటి ఇబ్బందులూ ఉండవని ఆయా దేశాలు పేర్కొన్నాయి. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని గల్ఫ్ దేశాలకు చెందిన ప్రతినిథులు పేర్కొన్నాయి. ఖతార్లో 6,30,000 మందికి పైగా భారతీయ కార్మికులున్నారు. ఖతార్ చిన్న దేశమైనా, అక్కడ భారతీయుల సంఖ్య చాలా ఎక్కువ. గల్ఫ్ దేశాల్లో ఉంటున్న భారతీయులకు ఎలాంటి సమస్యలు వచ్చినా, ఆయా దేశాల్లోని ఎంబసీని సంప్రదించాలని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. ఇంకో వైపున ఖతార్లోని దోహా నుంచి భారతీయ వలసదారులకు ఓ సూచన వచ్చింది. రూమర్స్ని ఎట్టి పరిస్థితుల్లో విశ్వసించరాదనీ, పరిస్థితులు ఖతార్లో ఏమంత ఆందోళనకరంగా లేవని ఖతార్ వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









