ఇక పై బ్యాంకు ఖాతాలకు ఆధార్ తప్పనిసరి
- June 16, 2017
కేంద్రం మరో కీలక నిర్ణయం
ఆధార్ విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కొత్తగా బ్యాంకు ఖాతా తెరిచే వారికి ఆధార్ను తప్పనిసరి చేసింది. దీంతో పాటు రూ.50వేలు ఆపై లావాదేవీలకు కూడా ఆధార్ను తప్పనిసరిగా సమర్పించాలని పేర్కొంది.
దీంతో పాటు ఇప్పటికే బ్యాంకు ఖాతా కలిగిన వారికి ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు గడువు విధించింది. ఆలోగా బ్యాంకు ఖాతాకు ఆధార్ను జత చేయకపోతే వాటిని చెల్లనివిగా గుర్తిస్తారు. ఈ మేరకు రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, పాన్ కార్డుల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం ఇప్పటికే పాన్కార్డుకు ఆధార్ను తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. ఒకటికి మించి పాన్ కార్డులను కొందరు వినియోగిస్తుండడాన్ని గుర్తించి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..







