ఇక పై బ్యాంకు ఖాతాలకు ఆధార్ తప్పనిసరి
- June 16, 2017
కేంద్రం మరో కీలక నిర్ణయం
ఆధార్ విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కొత్తగా బ్యాంకు ఖాతా తెరిచే వారికి ఆధార్ను తప్పనిసరి చేసింది. దీంతో పాటు రూ.50వేలు ఆపై లావాదేవీలకు కూడా ఆధార్ను తప్పనిసరిగా సమర్పించాలని పేర్కొంది.
దీంతో పాటు ఇప్పటికే బ్యాంకు ఖాతా కలిగిన వారికి ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు గడువు విధించింది. ఆలోగా బ్యాంకు ఖాతాకు ఆధార్ను జత చేయకపోతే వాటిని చెల్లనివిగా గుర్తిస్తారు. ఈ మేరకు రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, పాన్ కార్డుల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం ఇప్పటికే పాన్కార్డుకు ఆధార్ను తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. ఒకటికి మించి పాన్ కార్డులను కొందరు వినియోగిస్తుండడాన్ని గుర్తించి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









