గుండెపోటుతో ప్రవాస భారతీయని మృతి

- June 17, 2017 , by Maagulf
గుండెపోటుతో ప్రవాస భారతీయని మృతి

 స్థానిక తుబలి లోని అపార్ట్ మెంట్ లో గుండెపోటుతో ఒక ప్రవాస భారతీయుడు మరణించాడు. అల్ కహీజీ సాంకేతిక సేవల పర్యవేక్షకునిగా పనిచేసే ధర్మరాజు శుక్రవారం తెల్లవారుజామున 3:00 గంటల సమయంలో గుండెపోటు రావడంతో చనిపోయారు . గత కొంత కాలంగా ఆయన గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు.చికిత్స కోసం ధర్మరాజు భారతదేశంకు వెళ్లి ఇటీవల రెండు రోజుల క్రితం మనామా కు తిరిగి వచ్చారు. శుక్రవారం తెల్లవారుజామున ధర్మరాజు తీవ్రమైన ఛాతీనొప్పితో బాధపడుతున్నాడని, దీనితో స్థానికులు అంబులెన్స్ ను పిలిపించారు.ఈ లోపునే ప్రాణాలు విడిచారని ఒక అధికారి ఒకరు వెల్లడించారు. ఆయన బోతికకాయానికి సంబంధించిన పత్రాలు తదితర సాంప్రదాయాలు ముగిసిన వెంటనే ధర్మరాజు మృతదేహాన్ని ఆయన కుటుంబసభ్యులకు పంపుతామని ఆ అధికారి తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com