పొగరుబోతు పోలీస్ అధికారికి మూడు సంవత్సరాల జైలుశిక్ష
- June 17, 2017గల్ఫ్ దేశాల సమాఖ్యకు చెందిన ఒక పౌరుని పట్ల దురుసుగా ప్రవర్తించడమే కాక ఆ వ్యక్తి పై దాడికి పాల్పడి గాయపరిచిన నేరానికి ట్రాఫిక్ డైరెక్టరేట్ లో పనిచేస్తున్న ఓ పోలీసు అధికారి పొగరుకు తగిన బహుమతి లభించింది. మూడు సంవత్సరాలపాటు కటకటాల వెనుక ఉండాలంటూ హై క్రిమినల్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కోర్టు నివేదిక ప్రకారం,ఈ సంఘటన గత ఏడాది తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో మనామ హోటల్ లో జరిగింది, అక్కడ ప్రతివాది బార్ లో కూర్చొని ఒక బీరును తాగుతున్నాడు. ఆ క్షణాన అక్కడకు వచ్చిన పోలీసు అధికారికి జిసిసి పౌరుని మధ్య ఒక వివాదం జరిగింది. " మా డబ్బుతో మేము మిమ్మల్ని తీసుకొస్తాం ..అలాగే మిమ్ముల్ని కొనుగోలు చేస్తాం " అని గల్ఫ్ దేశాల సమాఖ్యకు చెందిన పౌరుడు తనతో వాదనకు తెర తీసేడని పోలీసు అధికారి న్యాయస్థానానికి తెలిపాడు. అనంతరం జిసిసి వ్యక్తి కొద్దిసేపటికి టాయిలెట్ లోనికి ప్రవేశించగానే ఆ నిందిత పోలీస్ అధికారి బాధితుడిని అనుసరించాడు. జిసిసి పౌరుడిని గోడ వైపునకు బలంగా నెట్టివేశాడు మరియు ఆ వ్యక్తి తలపై పిడి గుద్దులు విసరడమే కాక, బాధితుని ముక్కును విరగకొట్టాడు. దీనితో ఆ పోలీస్ ఆధికారిపై కేసు నమోదైంది.ఆ తర్వాత అరెస్టు కాబడిన ఆ పోలీస్ అధికారి తన నేరాన్ని న్యాయస్థానం ముందు అంగీకరించాడు.
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..