రమదాన్ సందర్భంగా ఖతర్ రాజు క్షమాభిక్ష
- June 23, 2017ఖతర్:పవిత్ర రమదాన్ మాసాన్ని పురస్కరించుకుని భారత్కు ఖతర్ తీపికబురు చెప్పింది. తమ దేశ జైల్లో మగ్గుతున్న 42 మంది భారతీయులకు అక్కడి ప్రభుత్వం క్షమాభిక్షను ప్రసాదించింది. ఈ మేరకు ఖతర్ రాజు షేక్ తమీమ్ బిన్ హమద్ ఉత్తర్వులు జారీచేసినట్టు భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. అయితే భారతీయ ఖైదీల్లో ఎవరెవరు విడుదలయ్యారనేది తెలియరాలేదు. ఇటీవల సౌదీ సహా కొన్ని గల్ఫ్ దేశాలు ఖతర్పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఖతర్తో అన్ని రకాల సంబంధాలను తెగదెంపులు చేసుకుంటున్నట్లు ప్రకటించి, విమాన రాకపోకలను కూడా నిలిపివేశాయి. దీంతో ఆ దేశంలోని భారతీయులు కొంత ఇబ్బంది పడ్డారు. అంతర్జాతియంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రంజాన్ సందర్భంగా భారీ సంఖ్యలో భారతీయులకు క్షమాభిక్ష ప్రకటించడం విశేషం. వీరిలో చాలామంది యజమానుల అక్రమ కేసుల్లో బాధితులు కాగా, మరికొంతమంది నేర చరిత్ర కలిగిన వారని తెలుస్తోంది.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు