రమదాన్ సందర్భంగా ఖతర్ రాజు క్షమాభిక్ష
- June 23, 2017ఖతర్:పవిత్ర రమదాన్ మాసాన్ని పురస్కరించుకుని భారత్కు ఖతర్ తీపికబురు చెప్పింది. తమ దేశ జైల్లో మగ్గుతున్న 42 మంది భారతీయులకు అక్కడి ప్రభుత్వం క్షమాభిక్షను ప్రసాదించింది. ఈ మేరకు ఖతర్ రాజు షేక్ తమీమ్ బిన్ హమద్ ఉత్తర్వులు జారీచేసినట్టు భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. అయితే భారతీయ ఖైదీల్లో ఎవరెవరు విడుదలయ్యారనేది తెలియరాలేదు. ఇటీవల సౌదీ సహా కొన్ని గల్ఫ్ దేశాలు ఖతర్పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఖతర్తో అన్ని రకాల సంబంధాలను తెగదెంపులు చేసుకుంటున్నట్లు ప్రకటించి, విమాన రాకపోకలను కూడా నిలిపివేశాయి. దీంతో ఆ దేశంలోని భారతీయులు కొంత ఇబ్బంది పడ్డారు. అంతర్జాతియంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రంజాన్ సందర్భంగా భారీ సంఖ్యలో భారతీయులకు క్షమాభిక్ష ప్రకటించడం విశేషం. వీరిలో చాలామంది యజమానుల అక్రమ కేసుల్లో బాధితులు కాగా, మరికొంతమంది నేర చరిత్ర కలిగిన వారని తెలుస్తోంది.
తాజా వార్తలు
- T20 ప్రపంచకప్...బ్రాండ్ అంబాసిడర్గా బోల్ట్
- తెలంగాణ రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి
- ఇళ్ల మరమ్మతులకు Dh2 బిలియన్ ఫండ్
- ఈజిప్షియన్లకు వర్క్ పర్మిట్ జారీ నిలిపివేత..!
- విదేశీ కార్మికుల కోసం బహ్రెయిన్లో కొత్త చట్టం..!
- హాస్పిటల్లో చేరిన కింగ్ సల్మాన్..!
- ఒమన్ లో 'ఎక్స్చేంజ్ యువర్ ల్యాండ్' ప్రారంభం
- ఏప్రిల్ 16న విధించిన ట్రాఫిక్ జరిమానాలు రద్దు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..