రమదాన్ సందర్భంగా ఖతర్ రాజు క్షమాభిక్ష
- June 23, 2017
ఖతర్:పవిత్ర రమదాన్ మాసాన్ని పురస్కరించుకుని భారత్కు ఖతర్ తీపికబురు చెప్పింది. తమ దేశ జైల్లో మగ్గుతున్న 42 మంది భారతీయులకు అక్కడి ప్రభుత్వం క్షమాభిక్షను ప్రసాదించింది. ఈ మేరకు ఖతర్ రాజు షేక్ తమీమ్ బిన్ హమద్ ఉత్తర్వులు జారీచేసినట్టు భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. అయితే భారతీయ ఖైదీల్లో ఎవరెవరు విడుదలయ్యారనేది తెలియరాలేదు. ఇటీవల సౌదీ సహా కొన్ని గల్ఫ్ దేశాలు ఖతర్పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఖతర్తో అన్ని రకాల సంబంధాలను తెగదెంపులు చేసుకుంటున్నట్లు ప్రకటించి, విమాన రాకపోకలను కూడా నిలిపివేశాయి. దీంతో ఆ దేశంలోని భారతీయులు కొంత ఇబ్బంది పడ్డారు. అంతర్జాతియంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రంజాన్ సందర్భంగా భారీ సంఖ్యలో భారతీయులకు క్షమాభిక్ష ప్రకటించడం విశేషం. వీరిలో చాలామంది యజమానుల అక్రమ కేసుల్లో బాధితులు కాగా, మరికొంతమంది నేర చరిత్ర కలిగిన వారని తెలుస్తోంది.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









