మ్యాన్‌హోల్‌లో పడి ఆరేళ్ళ చిన్నారి మృతి

- June 26, 2017 , by Maagulf
మ్యాన్‌హోల్‌లో పడి ఆరేళ్ళ చిన్నారి మృతి

ఆరేళ్ళ బాలుడి మృతదేహం మ్యాన్‌హోల్‌లో లభ్యం కావడం అందర్నీ షాక్‌కి గురిచేసింది. భారతదేశానికి చెందిన ఆరేళ్ళ బాలుడు ఇజాన్‌ అహ్మద్‌ బషీర్‌, వుకైర్‌లోని ఐడియల్‌ ఇండియన్‌ స్కూల్‌లో చదువుకుంటున్నాడు. తల్లిదండ్రులతో కలిసి ఓ రెస్టారెంట్‌కి ఇజాన్‌ వెళ్ళాడు. అయితే, అక్కడ తల్లిదండ్రులు తమ బిడ్డ ఇజాన్‌ మిస్‌ అయిన విషయాన్ని తెలుసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలో ఇజాన్‌ మ్యాన్‌ హోల్‌లో పడి మృతి చెందినట్లు పోలీసులు కనుగొన్నారు. ఇజాన్‌ మృతి పట్ల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. కమ్యూనిటీ మెంబర్స్‌, ఇతర సన్నిహితులు ఇజాన్‌ తల్లిదండ్రులను ఓదార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com