మొదలైన అమర్నాథ్ యాత్ర
- June 28, 2017
జమ్ముకశ్మీర్లోని దక్షిణ పర్వత ప్రాంతంలో ఉన్న పవిత్ర అమర్నాథ్ గుహను దర్శించుకునేందుకు తొలి యాత్ర ప్రారంభమైంది. బుధవారం ఉదయం 5గంటల ప్రాంతంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నిర్మల్సింగ్ జెండా వూపి అమర్నాథ్ యాత్రను ప్రారంభించారు. జమ్ము బేస్ క్యాంపు వద్ద తొలి బృందంలో 2,280మంది భక్తులు యాత్రకు బయల్దేరారు. 40 రోజుల పాటు సాగే ఈ యాత్రలో పాల్గొనేందుకు ఈసారి 2.3లక్షలకు పైగా భక్తులు పేర్లు నమోదు చేసుకున్నారు.
ఈసారి యాత్రను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులు చేపట్టవచ్చని నిఘా వర్గలు హెచ్చరించాయి. 100 నుంచి 150 మంది భక్తులు, 100 మంది పోలీసులను అంతమొందించాలని ఉగ్రవాదులు భావిస్తున్నట్లు పేర్కొన్నాయి. ఈ మేరకు పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ రాసిన లేఖ సోషల్మీడియాలో ప్రత్యక్షమైంది. నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నట్లు పోలీసు శాఖ వెల్లడించింది. యాత్రకు దాదాపు 35వేల మంది పోలీసులు, సైనిక సిబ్బందితో ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది. ఈ యాత్ర ఆగస్టు 7న ముగియనుంది.
తాజా వార్తలు
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!







