మొదలైన అమర్నాథ్ యాత్ర
- June 28, 2017
జమ్ముకశ్మీర్లోని దక్షిణ పర్వత ప్రాంతంలో ఉన్న పవిత్ర అమర్నాథ్ గుహను దర్శించుకునేందుకు తొలి యాత్ర ప్రారంభమైంది. బుధవారం ఉదయం 5గంటల ప్రాంతంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నిర్మల్సింగ్ జెండా వూపి అమర్నాథ్ యాత్రను ప్రారంభించారు. జమ్ము బేస్ క్యాంపు వద్ద తొలి బృందంలో 2,280మంది భక్తులు యాత్రకు బయల్దేరారు. 40 రోజుల పాటు సాగే ఈ యాత్రలో పాల్గొనేందుకు ఈసారి 2.3లక్షలకు పైగా భక్తులు పేర్లు నమోదు చేసుకున్నారు.
ఈసారి యాత్రను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులు చేపట్టవచ్చని నిఘా వర్గలు హెచ్చరించాయి. 100 నుంచి 150 మంది భక్తులు, 100 మంది పోలీసులను అంతమొందించాలని ఉగ్రవాదులు భావిస్తున్నట్లు పేర్కొన్నాయి. ఈ మేరకు పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ రాసిన లేఖ సోషల్మీడియాలో ప్రత్యక్షమైంది. నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నట్లు పోలీసు శాఖ వెల్లడించింది. యాత్రకు దాదాపు 35వేల మంది పోలీసులు, సైనిక సిబ్బందితో ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది. ఈ యాత్ర ఆగస్టు 7న ముగియనుంది.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









