ఉరి వేసుకొని ప్రవాసియ భారతీయుడి ఆత్మహత్య
- June 28, 2017
మనామ: సల్మాబాద్ లోని తన నివాసంలో ప్రవాస భారతీయుడు ఒకరు ఉరి వేసుకొని విషాదంగా తన జీవితాన్ని ముగించాడు. ఒలింపిక్ కాంట్రాక్టింగ్ కో.డబ్ల్యూ.ఎల్.ఎల్ సంస్థలో ఫోర్మెన్ గా పనిచేస్తున్న ఉద్యోగి రాజేష్ బట్టు మంగళవారం మధ్యాహ్నం 1:30 గంటలకు మృతి చెందారు. " తనంతట తాను స్వయంగా ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజేష్ బట్టు ఆ విధంగా ఎందుకు జీవితాన్ని ముగించాడో మాకు ఇంకా తెలియదు. అతను నిజంగా మంచి ఫోర్మన్గా ఉద్యోగ విధులు నిర్వహిచేవాడని ఆయన ఆకస్మిక మరణం పట్ల ఆ లోటు తీర్చలేరని, ఆయన మరణం ద్వారా జరిగిన నష్టానికి ఎంతో విచారంగా ఉన్నాము. రాజేష్ బట్టు పలు ఆరోగ్య సమస్యలను చనిపోయేవరకు ఎదుర్కొన్నాడని నిరంతరం ఆ ఆరోగ్య ఇబ్బందులపై ఫిర్యాదు చేసేవాడని కాని తన జీవితాన్ని ఎందుకు ఇలా అర్ధాంతరంగా ముగించాడు అనే విషయంలో ఇప్పటికీ ఆధారాలేవీ తమకు లభించడం లేదని అతని సహచరులలో ఒకరు చెప్పారు.చట్టబద్ధమైన లాంఛన ప్రాయాలను పూర్తి చేసిన తర్వాత రాజేష్ బట్టు భౌతికకాయాన్ని ఆయన స్వదేశానికి పంపబడుతుందని అధికారవర్గాలు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ రాజధాని దోహాలో మంత్రి నారాయణ బృందం పర్యటన
- ఖతార్ లో క్లాస్రూమ్ రీడింగ్ బ్యాగ్ ప్రాజెక్ట్..!!
- బహ్రెయిన్ లో రమదాన్ మద్దతుకు ఎంపీల ప్రతిపాదన..!!
- కువైట్ లో స్మార్ట్ ఎలక్ట్రానిక్ మానిటరింగ్ సిస్టం అమలు..!!
- రుస్తాక్ వింటర్ ఫెస్టివల్ 2026 ప్రారంభం..!!
- ద్వైపాక్షిక సంబంధాలు.. సౌదీ క్రౌన్ ప్రిన్స్, పుతిన్ చర్చలు..!!
- రమదాన్ కంటే ముందే పరీక్షల షెడ్యూల్ సర్దుబాటు..!!
- స్కూల్ పిల్లలకు ఉచితంగా ఆధార్ క్యాంపులు
- ముంచెత్తిన తీవ్ర హిమపాతం..35 మంది మృతి
- భారత్లో గూగుల్ మెగా ప్లాన్..20 వేల ఉద్యోగాలు రెడీ







