ఉరి వేసుకొని ప్రవాసియ భారతీయుడి ఆత్మహత్య
- June 28, 2017
మనామ: సల్మాబాద్ లోని తన నివాసంలో ప్రవాస భారతీయుడు ఒకరు ఉరి వేసుకొని విషాదంగా తన జీవితాన్ని ముగించాడు. ఒలింపిక్ కాంట్రాక్టింగ్ కో.డబ్ల్యూ.ఎల్.ఎల్ సంస్థలో ఫోర్మెన్ గా పనిచేస్తున్న ఉద్యోగి రాజేష్ బట్టు మంగళవారం మధ్యాహ్నం 1:30 గంటలకు మృతి చెందారు. " తనంతట తాను స్వయంగా ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజేష్ బట్టు ఆ విధంగా ఎందుకు జీవితాన్ని ముగించాడో మాకు ఇంకా తెలియదు. అతను నిజంగా మంచి ఫోర్మన్గా ఉద్యోగ విధులు నిర్వహిచేవాడని ఆయన ఆకస్మిక మరణం పట్ల ఆ లోటు తీర్చలేరని, ఆయన మరణం ద్వారా జరిగిన నష్టానికి ఎంతో విచారంగా ఉన్నాము. రాజేష్ బట్టు పలు ఆరోగ్య సమస్యలను చనిపోయేవరకు ఎదుర్కొన్నాడని నిరంతరం ఆ ఆరోగ్య ఇబ్బందులపై ఫిర్యాదు చేసేవాడని కాని తన జీవితాన్ని ఎందుకు ఇలా అర్ధాంతరంగా ముగించాడు అనే విషయంలో ఇప్పటికీ ఆధారాలేవీ తమకు లభించడం లేదని అతని సహచరులలో ఒకరు చెప్పారు.చట్టబద్ధమైన లాంఛన ప్రాయాలను పూర్తి చేసిన తర్వాత రాజేష్ బట్టు భౌతికకాయాన్ని ఆయన స్వదేశానికి పంపబడుతుందని అధికారవర్గాలు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!







