ఉరి వేసుకొని ప్రవాసియ భారతీయుడి ఆత్మహత్య

- June 28, 2017 , by Maagulf
ఉరి వేసుకొని  ప్రవాసియ భారతీయుడి ఆత్మహత్య

మనామ: సల్మాబాద్ లోని  తన నివాసంలో ప్రవాస భారతీయుడు ఒకరు ఉరి వేసుకొని విషాదంగా తన జీవితాన్ని ముగించాడు. ఒలింపిక్ కాంట్రాక్టింగ్ కో.డబ్ల్యూ.ఎల్.ఎల్ సంస్థలో ఫోర్మెన్ గా  పనిచేస్తున్న ఉద్యోగి రాజేష్ బట్టు మంగళవారం మధ్యాహ్నం 1:30 గంటలకు మృతి చెందారు. " తనంతట తాను స్వయంగా ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజేష్ బట్టు ఆ విధంగా ఎందుకు జీవితాన్ని ముగించాడో మాకు ఇంకా తెలియదు. అతను నిజంగా మంచి ఫోర్మన్గా ఉద్యోగ విధులు నిర్వహిచేవాడని ఆయన ఆకస్మిక మరణం పట్ల ఆ లోటు తీర్చలేరని, ఆయన మరణం ద్వారా జరిగిన నష్టానికి ఎంతో విచారంగా ఉన్నాము. రాజేష్ బట్టు పలు ఆరోగ్య సమస్యలను చనిపోయేవరకు ఎదుర్కొన్నాడని నిరంతరం ఆ ఆరోగ్య ఇబ్బందులపై ఫిర్యాదు చేసేవాడని కాని తన జీవితాన్ని ఎందుకు ఇలా అర్ధాంతరంగా ముగించాడు అనే విషయంలో ఇప్పటికీ ఆధారాలేవీ తమకు లభించడం లేదని అతని సహచరులలో ఒకరు చెప్పారు.చట్టబద్ధమైన లాంఛన ప్రాయాలను పూర్తి చేసిన తర్వాత రాజేష్ బట్టు భౌతికకాయాన్ని ఆయన స్వదేశానికి పంపబడుతుందని అధికారవర్గాలు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com