భారత ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం

- June 28, 2017 , by Maagulf
భారత ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం

ఇజ్రాయెల్లో పోప్, అమెరికా అధ్యక్షుడి స్థాయిలో ప్రొటోకాల్ జులై 4 నుంచి మూడు రోజులపాటు పర్యటన దిల్లీ: తమ దేశంలో జులై 4 నుంచి మూడు రోజులపాటు ప్రధాని నరేంద్ర మోదీ జరపనున్న పర్యటనకు ఇజ్రాయెల్ అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. విమానాశ్రయంలో ఆయనకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఆ దేశానికి చెందిన వివిధ రంగాల ప్రముఖులతో కూడిన ఉన్నతస్థాయి బృందం స్వాగతం పలకనుంది. ప్రొటోకాల్లో ఈ అరుదైన గౌరవాన్ని పోప్నకు, అమెరికా అధ్యక్షుడికి మాత్రమే ఇజ్రాయెల్ ఇస్తుంటుంది. బుధవారమిక్కడ ఇజ్రాయెల్ రాయబారి డేనియల్ కార్మన్ మీడియాకు ఈ విషయాన్ని తెలిపారు. మోదీ గౌరవార్థం జులై 4న తమ ప్రధాని విందు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com