జూలై 1 నుంచి పాన్-ఆధార్ అనుసంధానం తప్పనిసరి
- June 28, 2017
పన్ను ఎగవేతదారుల భరతం పట్టేందుకు ప్రభుత్వం నిబంధనలు కట్టుదిట్టం చేస్తోంది. ఇందులో భాగంగా మరో కొత్త నిబంధన తీసుకొచ్చింది. జూలై 1 నుంచి ఆదాయ పన్ను శాఖ ఇ-ఫైలింగ్ వెబ్సైట్ ద్వారా ప్రతి ఒక్కరూ తమ ఆధార్ కార్డు, పాన్ కార్డులను అనుసంధానం చేసుకోవాలని పేర్కొంది. బుధవారం ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక నుంచి పాన్ కార్డు కోసం దరఖాస్తు చేయాలన్నా ఆధార్ కార్డు నంబర్ లేదా ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసినపుడు కేటాయించిన గుర్తింపు నంబర్ అయినా పేర్కొనాలి. జూలై 1 నుంచి ఆదాయ పన్ను రిటర్న్లు ఫైల్ చేసేందుకూ పాన్ కార్డు-ఆధార్ కార్డు అనుసంధానమై ఉండాలని ఐటి శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. పాన్ కార్డుల జారీ, ఐటిఆర్ల ఫైలింగ్కు ఆధార్ను తప్పనిసరి చేస్తూ ఐటి చట్టంలో చేసిన మార్పులను సుప్రీం కోర్టు ఇటీవల సమర్ధించింది. దీంతో జూలై 1 నుంచి పాన్ నంబర్ కోసం చేసే దరఖాస్తుల్లోనూ ఆధార్ నంబర్ పేర్కొనాలని రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా వార్తలు
- అమెరికాతో చర్చలకు అధ్యక్షుడి ఆదేశాలు: ఇరాన్ మీడియా
- 10 తర్వాత పూర్తి స్థాయిలో ఇండిగో విమానాల కార్యాచరణ
- అగ్రిటెక్ 2026: ఫిబ్రవరి 12న ప్రారంభం..!!
- జజాన్ హానీ ఎగ్జిబిషన్.. 4 రోజుల్లో రికార్డు సేల్స్..!!
- వెబ్సైట్ డౌన్.. యూఏఈ లాటరీ క్లారిటీ..!!
- ఎక్స్ఛేంజ్ కంపెనీలలో క్యాష్ లిమిట్ తగ్గింపు..!!
- డిజెబిలిటీ కార్డుతో ప్రభుత్వ సేవలు, ప్రయోజనాలు..!!
- రమదాన్ కు సిద్ధమవుతున్న బహ్రెయిన్..!!
- నంబర్ ప్లేట్ కోసం రూ.2.08 కోట్లు..వ్యాపారవేత్త సంచలనం
- ఓల్డ్ దోహా పోర్టులో 6రోజులపాటు స్పోర్ట్స్ ఫెస్టివల్..!!







