ఎయిర్ ఇండియా పై కన్నేసిన ఇండిగో
- June 29, 2017
ప్రభుత్వ రంగంలోని ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసేందుకు ప్రైవేట్ రంగంలోని బడ్జెట్ ఎయిర్లైన్స్ సంస్థ 'ఇండిగో' ఆసక్తి చూపిస్తోంది. కంపెనీ నుంచి ఈ మేరకు ప్రతిపాదన అందినట్టు కేంద్ర పౌర విమానయన మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందుకోసం ఇండిగో సంస్థ ప్రెసిడెంట్ ఆదిత్య ఘోష్ నుంచి లేఖ అందినట్టు పేర్కొంది. ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసిన వెంటనే ఇండిగో ఇందుకు ముందుకు రావడం విశేషం. అయితే ఎయిర్ ఇండియా మొత్తాన్నిగాక ఆ సంస్థ అంతర్జాతీయ ఆపరేషన్లపై మాత్రమే ఇండిగో ఆసక్తి చూపిస్తోంది. ఇప్పటి వరకు టాటా గ్రూపు మాత్రమే ఎయిర్ ఇండియాపై ఆసక్తితో ఉన్నట్టు భావించారు. ఇపుడు ఇండిగో కూడా రంగంలోకి దిగడంతో పోటీ బాగానే ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఎయిర్ ఇండియాకు ఉన్న రూ.52,000 కోట్ల అప్పుల పరిష్కారం ఎలా అనే దానిపైనే డీల్ ఆధారపడి ఉంటుందని మార్కెట్ వర్గాల అంచనా.
అంత సాహసం నాకు లేదు : మహీంద్రా
ఎయిరిండియాలో ఇన్వెస్ట్ చేసేంత సాహసం తమకు లేదని మహీంద్రా గ్రూప్ సారథి ఆనంద్ మహీంద్రా అన్నారు. ''సాధారణంగా నన్ను నేను సాహసవంతుడుగానే భావిస్తాను. కాని ఎయిరిండియాలో ఇన్వెస్ట్ చేసేంత సాహసం మాత్రం నాకు లేదు'' అని ఆయన ఒక ట్విట్టర్ సందేంలో స్పష్టం చేశారు. వ్యాపార దిగ్గజాల్లో ఒకటి కావడం వల్ల మహీంద్రా గ్రూప్ ఎయిరిండియాలో ఇన్వెస్ట్ చేస్తుందా అంటూ ఎవరో చేసిన ట్వీట్కు ఆయన ఈ విధంగా స్పందించారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్ చర్యను ఖండించిన ఒమన్ సహా 14 దేశాలు..!!
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది









