ఎయిర్ ఇండియా పై కన్నేసిన ఇండిగో
- June 29, 2017
ప్రభుత్వ రంగంలోని ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసేందుకు ప్రైవేట్ రంగంలోని బడ్జెట్ ఎయిర్లైన్స్ సంస్థ 'ఇండిగో' ఆసక్తి చూపిస్తోంది. కంపెనీ నుంచి ఈ మేరకు ప్రతిపాదన అందినట్టు కేంద్ర పౌర విమానయన మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందుకోసం ఇండిగో సంస్థ ప్రెసిడెంట్ ఆదిత్య ఘోష్ నుంచి లేఖ అందినట్టు పేర్కొంది. ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసిన వెంటనే ఇండిగో ఇందుకు ముందుకు రావడం విశేషం. అయితే ఎయిర్ ఇండియా మొత్తాన్నిగాక ఆ సంస్థ అంతర్జాతీయ ఆపరేషన్లపై మాత్రమే ఇండిగో ఆసక్తి చూపిస్తోంది. ఇప్పటి వరకు టాటా గ్రూపు మాత్రమే ఎయిర్ ఇండియాపై ఆసక్తితో ఉన్నట్టు భావించారు. ఇపుడు ఇండిగో కూడా రంగంలోకి దిగడంతో పోటీ బాగానే ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఎయిర్ ఇండియాకు ఉన్న రూ.52,000 కోట్ల అప్పుల పరిష్కారం ఎలా అనే దానిపైనే డీల్ ఆధారపడి ఉంటుందని మార్కెట్ వర్గాల అంచనా.
అంత సాహసం నాకు లేదు : మహీంద్రా
ఎయిరిండియాలో ఇన్వెస్ట్ చేసేంత సాహసం తమకు లేదని మహీంద్రా గ్రూప్ సారథి ఆనంద్ మహీంద్రా అన్నారు. ''సాధారణంగా నన్ను నేను సాహసవంతుడుగానే భావిస్తాను. కాని ఎయిరిండియాలో ఇన్వెస్ట్ చేసేంత సాహసం మాత్రం నాకు లేదు'' అని ఆయన ఒక ట్విట్టర్ సందేంలో స్పష్టం చేశారు. వ్యాపార దిగ్గజాల్లో ఒకటి కావడం వల్ల మహీంద్రా గ్రూప్ ఎయిరిండియాలో ఇన్వెస్ట్ చేస్తుందా అంటూ ఎవరో చేసిన ట్వీట్కు ఆయన ఈ విధంగా స్పందించారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









