ప్రభుదేవా డైరక్షన్ లో నటించనున్న ప్రభాస్
- June 30, 2017
కొరియోగ్రాఫర్, దర్శకుడు ప్రభుదేవా తీయబోయే తదుపరి చిత్రంలో ప్రభాస్ నటించనున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఇప్పటికే ప్రభుదేవా, తమన్నా జంటగా నటిస్తున్న 'ఖామోషి' చిత్రంలో ప్రభాస్ అతిథి పాత్రలో కన్పించనున్నట్లు వూహాగానాలు వినిపిస్తున్నాయి.
ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న 'సాహో' సినిమా చిత్రీకరణ పూర్తయ్యాక ప్రభుదేవాతో కలిసి పనిచేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీని గురించి ప్రభుదేవా మీడియాతో మాట్లాడుతూ.. 'కేవలం బిజినెస్ కోసం ఇద్దరం కలిసి సినిమా చేయడంలో అర్థంలేదు. నాకు ప్రభాస్తో సినిమా తీయాలనుంది. ఇప్పుడు ఆయన 'సాహో' సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా అయ్యాక ఏ విషయం అనేది ప్రకటిస్తాం' అని చెప్పినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన
- పాన్ కార్డు ఉన్నవారికి కొత్త రూల్స్..ఇక నుంచి ఈ లావాదేవీలకు తప్పనిసరి
- ఫేక్ కన్జూమర్ ప్రొటెక్షన్ వెబ్సైట్ల పై అబుదాబి పోలీసులు హెచ్చరిక..!!
- ప్రభుత్వ స్టాంపులు ఫోర్జరీ.. ఐదుగురు బంగ్లాదేశీయులు అరెస్ట్..!!
- ఏప్రిల్లో బహ్రెయిన్ ఆపరేషన్స్ రూమ్ కు 1,606 కాల్స్..!!
- 7 రోజుల్లో 7,989 మందిని బహిష్కరించిన సౌదీ అరేబియా..!!
- జూన్ 13 యూఏఈ లాటరీ డ్రా.. విజేత నంబర్లు ఇవే..!!









