మాజీ లవర్స్ ని మళ్ళీ కలిపిన సైమా ఫంక్షన్

- July 04, 2017 , by Maagulf
మాజీ లవర్స్ ని మళ్ళీ కలిపిన సైమా ఫంక్షన్

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ రానా.. చెన్నై సుందరి త్రిష ల మధ్య ప్రేమ అంటూ.. కొంతకాలం క్రితం వార్తలు ప్రముఖంగా వినిపించాయి. వీరిద్దరూ మద్య ప్రేమ సహజీవనం వరకూ వెల్లిందని కూడా ఓ టాక్.. కానీ త్రిష ఇంతలో వేరే అతనితో ప్రేమ పెళ్లి అంటూ నిశ్చితార్ధం.. దీంతో ఇద్దరూ ఒకరినొకరు పలకరించుకోలేని స్టేజ్ కి వెళ్లారు.. కాగా తాజాగా ఈ మాజీ లవ్వర్స్ ని కలిసేందుకు సైమా అవార్డ్స్ ఫంక్షన్ వేదిక అయ్యింది అని అంటున్నారు.. ఫంక్షన్ లో రానా, త్రిష లు పక్కపక్కనే కూర్చుని చాలా సరదాగా.. సంతోషంగా మాట్లాడుకోవడం మీడియా దృష్టికి వచ్చింది.. ఈ ఫంక్షన్ లో ఎంత మంది బ్యూటీలు వచ్చినా.. రానా తన దృష్టి అంతా త్రిష మీదనే పెట్టి మాట్లాడుతూనే ఉన్నాడు.. దీంతో రానా త్రిషల బంధాన్ని మళ్ళీ చిగురింప జేసిన సైమా అవార్డ్స్ ఫంక్షన్ వేడుక అని టాక్ వినిపిస్తోంది.. పైగా త్రిష ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తనకు ఎంత మంది ఫ్రెండ్స్ ఉన్నా.. రానా వెరీ వెరీ స్పెషల్ అని చెప్పడంతో.. రానా త్రిషల మధ్య ప్రేమ బంధం మళ్ళీ చిగురు తొడిగింది అనే టాక్ వినిపిస్తోంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com