పోలీస్ స్టేషన్లలో మల్టీ స్టోరీ పార్కింగ్
- July 04, 2017
పోలీస్ స్టేషన్లకు దగ్గరలో పార్కింగ్ కోసం ఇకపై పెద్దగా ప్రయాస ఉండకపోవచ్చు. దుబాయ్ పోలీసులు, ఈ మేరకు కసరత్తులు ప్రారంభించారు. పోలీస్ స్టేషన్ని సందర్శించేవారికి పార్కింగ్ సమస్యలను తగ్గించడం కోసం మల్టీ స్టోరీ స్మార్ట్ పార్కింగ్ సిస్టమ్తో చెక్ పెడతామని దుబాయ్ పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ అబ్దుల్లా ఖలీఫా అల్ మెర్రి చెప్పారు. నైఫ్, రిఫ్ఫా, మురాఖాబాత్ పోలీస్ స్టేషన్లలో తొలి ఫేజ్లో భాగంగా ఈ ప్రాజెక్టుని అమలు చేయనున్నారు. స్మార్ట్ పోలీసింగ్లో భాగంగా ఈ స్మార్ట్ పార్కింగ్ని సందర్శకుల కోసం రూపొందిస్తున్నట్లు దుబాయ్ పోలీస్ డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూస్ అండ్ ఫండ్ ఇన్ది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ బ్రిగేడియర్ నయీమ్ అల్ ఖతీబ్ చెప్పారు. ప్రస్తుతం మల్టీ స్టోరీ స్మార్ట్ పార్కింగ్ కోసం పలు రకాలైన మోడల్స్ని అధ్యయనం చేస్తున్నామనీ, అధ్యయనం పూర్తికాగానే ప్రాజెక్టులను ప్రారంభిస్తామని అన్నారు. స్మార్ట్ మెకానిజం ద్వారా కారు పార్క్ చేయాలనుకున్న వ్యక్తికి ఓ టిక్కెట్ అక్కడిక్కడే ఇవ్వడం జరుగుతుందనీ, ఆ టిక్కెట్ని తిరిగి వెళ్ళే సమయంలో ఇన్సెర్ట్ చేస్తే, ఎవరి ప్రమేయమూ లేకుండా కారు పార్కింగ్ స్లాట్ నుంచి ఆ వ్యక్తికి ఆ కారు అందుతుందని అల్ ఖతీబ్ చెప్పారు.
తాజా వార్తలు
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!









