రమ్యకృష్ణ నక్షత్రం కాదు.. ఆకాశం.. చుక్కలు చూపించాను.. కృష్ణవంశీ
- July 06, 2017
టాలీవుడ్లో సెన్సేషనల్ డైరెక్టర్లలో కృష్ణవంశీ ఒకరు. విభిన్నమైన చిత్రాలను తీసి ప్రేక్షకులను మెప్పించడంలో ఆయనది డిఫరెంట్ స్టయిల్. రాశి కంటే వాసి ఎక్కువగా నమ్మే కృష్ణవంశీ గత 20 ఏళ్లలో ఆయన తీసింది కేవలం 20 చిత్రాలు మాత్రమే. తాజాగా ఆయన రూపొందించిన నక్షత్రం చిత్రం విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్లోని ఎన్ కన్వెన్షన్ హాల్లో బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో తన కుమారుడు, భార్య రమ్యకృష్ణపై ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.. అవేమిటంటే..
1
చాలామందికి చుక్కలు చూపించాను
ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా కృష్ణవంశీని యాంకర్ ఉదయభాను సరదాగా ప్రశ్నను అడిగింది. ఎంతో మంది స్టార్స్తో మీరు వర్క్ చేశారు కదా?.. మీకు ఏ స్టార్ అయినా చుక్కలు చూపించారా?'' అని అడగ్గా.. చాలా మంది నటులకు నేనే చుక్కలు చూపించాను' అంటూ కృష్ణ వంశీ నవ్వుతూ సమాధానం ఇచ్చారు.
2
నా కొడుకు నక్షత్రం
'మీ లైఫ్లో నక్షత్రం ఎవరు? సినిమాలో నక్షత్రం ఎవరు?' అని ఉదయభాను అడిగిన మరో ప్రశ్నకు 'నా లైఫ్లో నక్షత్రం నా కొడుకు' అని కృష్ణవంశీ చెప్పారు. అయితే వేదిక మీద ఉన్న కొందరు రమ్యకృష్ణ పేరు ప్రస్తావించారు. దానికి కృష్ణవంశీ స్పందిస్తూ 'రమ్యకృష్ణ నక్షత్రం కాదు.. ఆకాశం' అని బదులిచ్చారు. కృష్ణవంశీ సమాధానానికి అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ నవ్వేశారు. ఇక ఈ సినిమా విషయంలో అందరూ నక్షత్రాలే అని సెలవిచ్చారు కృష్ణవంశీ.
3
20 ఏళ్లకు పైగా సినీ కెరీర్
గులాబీ చిత్రంతో 1995లో కృష్ణవంశీ దర్శకుడిగా మారాడు. దాదాపు రెండు దశాబ్దాలకుపైగా సినీ కెరీర్లో అంతపురం, నిన్నే పెళ్లాడుతా, ఖడ్గం, మురారీ, గోవిందుడు అందరివాడేలే లాంటి హిట్ చిత్రాలను రూపొందించారు. ఇటీవల ఆయన తీసిన చిత్రాలు కమర్శియల్గా సక్సెస్ సాధించకపోయినా విమర్శకులు ప్రశంసలు అందుకొన్నాయి.
4
కృష్ణవంశీ, రమ్యకృష్ణల వివాహం ఇలా..
చంద్రలేఖ సినిమా షూటింగ్లో హీరోయిన్ రమ్యకృష్ణతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. తమ ప్రేమను వారిద్దరూ పెళ్లిపీటలపైకి ఎక్కించారు. 2003 జూన్ 12న కృష్ణవంశీ, రమ్యకృష్ణ వివాహం చేసుకొన్నారు. ఆ తర్వాత వారికి ఓ కుమారుడు కలిగాడు. బాహుబలి చిత్రంలో రమ్యకృష్ణ పోషించిన పాత్రకు దేశవ్యాప్తంగా విశేష ఆదరణ లభించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- 'వాహన్' పోర్టల్లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?
- కుటుంబ సభ్యుల 72 రోజుల నిరీక్షణ ముగిసింది
- తెలంగాణ: డీజీపీ ఎదుట లొంగిపోయిన నలుగురు అగ్రనేతలు
- ‘Sahl’ ద్వారా వెహికల్ డ్రైవింగ్ ఆథరైజేషన్ సర్వీస్..!!
- హమద్ టౌన్, జనబియా రోడ్లలో సేఫ్టీ పెంపు..!!
- కోఆర్డినేట్లను ఉపసంహరించుకోండి..ఇరాక్ కు జిసిసి చీఫ్ పిలుపు..!!
- దుబాయ్, షార్జాలో పలు ఫ్లైట్స్ డిలే.. క్యాన్సిల్..!!









