మధ్యాహ్న పని నిషేధం ఇప్పటికీ అమలులోనే ఉంది

- July 06, 2017 , by Maagulf
మధ్యాహ్న పని నిషేధం ఇప్పటికీ అమలులోనే ఉంది

కువైట్: మండు వేసవి మధ్యాహ్నం సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఆరు బయిట ప్రాంతాల్లో కార్మికులతో  పని చేయించడం నిషేధించాలనే  నిర్ణయం ఇప్పటికీ అమలు చేయబడుతుందని, పబ్లిక్ అథారిటీ ఆఫ్ మాన్ పవర్ యొక్క డిప్యూటీ డైరెక్టర్ మేనేజర్ అబ్దుల్లా అల్ ముతౌతా బుధవారం చెప్పారు. జూన్ 1 వ తేదీ నుండి అమలులో ఉన్న ఈ నిర్ణయం కొనసాగింపబడుతుందని అన్నారు. అగ్నిగుండం మాదిరిగా ఉన్న సూర్యుని దహన వేడి కింద పనులు చేస్తున్న కార్మికుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం అమలు చేయడానికి అధికారంను ఇందుకై ఉపయోగిస్తున్నట్లు ఆయన తెలిపారు. 56 పని ప్రదేశాలలో 132 మంది కార్మికులు మధ్యాహ్న పని నిషేధం ఉల్లంఘించినట్లు అబ్దుల్లా అల్ ముతౌతా చెప్పారు. 83 మందితో కూడిన 35 పని స్థలాలలో మాత్రమే తమ నిర్ణయం అమలవుతున్నట్లు ఆయన చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com