ఎంపీల చే రాష్ట్రపతికి జులై 23న ఘనమైన వీడ్కోలు
- July 07, 2017
రాష్ట్రపతిగా పదవీ విరమణ చేయనున్న ప్రణబ్ ముఖర్జీకి పార్లమెంట్ ఉభయసభలు ఘన వీడ్కోలు పలకనున్నాయి. జులై 23న పార్లమెంట్ సభ్యులు రాష్ట్రపతికి వీడ్కోలు ఇవ్వనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
2012 జులై 25న భారత 13వ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన ప్రణబ్ ముఖర్జీ.. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ, భాజపా నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాలతో కలిసి పనిచేశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ప్రణబ్.. గతంలో విదేశీ వ్యవహారాలు, రక్షణ, ఆర్థిక మంత్రిగా పనిచేశారు. జులై 24న రాష్ట్రపతిగా ఆయన పదవీకాలం పూర్తవనుంది. ఈ నేపథ్యంలో అంతకు ఒకరోజు ముందుగా జులై 23న రాష్ట్రపతికి వీడ్కోలు ఇవ్వనున్నారు.
రాష్ట్రపతి పదవీకాలం పూర్తవడంతో తదుపరి రాష్ట్రపతి ఎంపిక కోసం ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ఖరారు చేసింది. కాగా.. రాష్ట్రపతి ఎన్నికకు అధికార పక్షం నుంచి బిహార్ మాజీ గవర్నర్ రామ్నాథ్ కోవింద్, ప్రతిపక్షాల నుంచి లోక్సభ మాజీ స్పీకర్ మీరాకూమార్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. జులై 17న రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. జులై 20న ఫలితాలు విడుదల చేయనున్నారు.
తాజా వార్తలు
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!









