కార్మికుడి మృతి: యూఏఈ కాంట్రాక్టర్పై అభియోగాలు
- July 07, 2017
రస్ అల్ ఖైమా: రస్ అల్ ఖైమా మిస్డెమీనర్ కోర్టులో అరబ్ కాంట్రాక్టర్ ఒకరిపై అభియోగాలు మోపబడ్డాయి. కార్మికుడి మృతికి సంబంధించిన కేసు ఇది. వర్క్ సైట్లో కార్మికుడు మృతి చెందగా, దానికి బాధ్యత కాంట్రాక్టర్దేనని అభియోగాలున్నాయి. తగినన్ని భద్రతా చర్యలు వర్క్ సైట్లో చేపట్టకపోవడమే కార్మికుడి మృతికి కారణమని కేసు నమోదయ్యింది. బ్లూ కాలర్ కార్మికుడు, అల్ ఖైమాకి చెందిన ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. కంపెనీ యజమాని చెప్పిన మేరకు పని చేస్తూ మృతి చెందాడు. అయితే, అనుకోకుండా జరిగిన ప్రమాదానికి తనను బాధ్యుడిని చేయడం తగదని అభియోగాలు ఎదుర్కొంటున్న కాంట్రాక్టర్ న్యాయస్థానం యెదుట తన వాదనలు విన్పించారు. వర్క్ సైట్లో కార్కికుల భద్రత కాంట్రాక్టర్దేనని న్యాయస్థానం వెల్లడించింది. తదుపరి విచారణను న్యాయస్థానం వాయిదా వేసింది.
తాజా వార్తలు
- గుడ్ న్యూస్..భారత్ కు వెనిజులా ఆయిల్ వచ్చేస్తోంది!
- ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యం
- లోక్ భవన్లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు
- 8వ వేతన సంఘం అప్డేట్..
- గల్ఫ్ ఎయిర్ టేకాఫ్ సేల్..తక్కవ ధరలకే 150,000 టిక్కెట్లు..!!
- సులైబిఖాట్ బీచ్లో ఫోటోగ్రాఫర్లపై ఆంక్షలు..!!
- ట్రావెల్ అండ్ టూరిజం సంస్థకు OMR15,815 ఫైన్..!!
- అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు..మార్చిలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా?









