కార్మికుడి మృతి: యూఏఈ కాంట్రాక్టర్పై అభియోగాలు
- July 07, 2017
రస్ అల్ ఖైమా: రస్ అల్ ఖైమా మిస్డెమీనర్ కోర్టులో అరబ్ కాంట్రాక్టర్ ఒకరిపై అభియోగాలు మోపబడ్డాయి. కార్మికుడి మృతికి సంబంధించిన కేసు ఇది. వర్క్ సైట్లో కార్మికుడు మృతి చెందగా, దానికి బాధ్యత కాంట్రాక్టర్దేనని అభియోగాలున్నాయి. తగినన్ని భద్రతా చర్యలు వర్క్ సైట్లో చేపట్టకపోవడమే కార్మికుడి మృతికి కారణమని కేసు నమోదయ్యింది. బ్లూ కాలర్ కార్మికుడు, అల్ ఖైమాకి చెందిన ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. కంపెనీ యజమాని చెప్పిన మేరకు పని చేస్తూ మృతి చెందాడు. అయితే, అనుకోకుండా జరిగిన ప్రమాదానికి తనను బాధ్యుడిని చేయడం తగదని అభియోగాలు ఎదుర్కొంటున్న కాంట్రాక్టర్ న్యాయస్థానం యెదుట తన వాదనలు విన్పించారు. వర్క్ సైట్లో కార్కికుల భద్రత కాంట్రాక్టర్దేనని న్యాయస్థానం వెల్లడించింది. తదుపరి విచారణను న్యాయస్థానం వాయిదా వేసింది.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









