దుబాయి ఎయిర్పోర్ట్లో షేక్ హందాన్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్
- July 07, 2017
దుబాయ్ : యూఏఈ ప్రధానమంత్రి, వైస్ ప్రెసిడెంట్ మరియు దుబాయ్ యొక్క పాలకుడు శ్రీశ్రీ షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తోయం గురువారం ఆకస్మికంగా దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 3 ను సందర్శించారు.ఈ సందర్భంగా ప్రయాణీకుల రద్దీ ప్రవాహాన్ని సమీక్షించి, వారికి అందించబడుతున్న సౌకర్యాల గూర్చి వాకబు చేశారు.తన పర్యటనను కాంకోర్స్ 3 లో బయలుదేరే హాల్ వద్ద ప్రారంభించారు, అక్కడ అతను ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ చెక్-ఇన్ కౌంటర్లు, సామాను-పరిశీలన సౌకర్యాలు మరియు పాస్పోర్ట్ కౌంటర్లు వద్ద ఆగి పాస్పోర్ట్ అధికారులతో సంప్రదించారు, ప్రయాణీకులను మర్యాదతో గౌరవించమని వారిని కోరారు వివిధ కారణాల రీత్యా విదేశాలకు వెళ్లేందుకు దుబాయి ఎయిర్పోర్ట్కు వచ్చిన యూఏఈ పౌరులంతా.. ఒక్కసారిగా తమ కళ్ల ముందు కనిపించిన దృశ్యాన్ని చూసి నమ్మలేకపోయారు. దుబాయి రారు, యూఏఈ ప్రధానమంత్రి షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ దుబాయి ఎయిర్పోర్ట్లో ప్రత్యేక పర్యటన చేశారు. దుబాయి నుంచి అమెరికాకు వెళ్లే విమానాల్లో ల్యాప్టాప్, టాబ్స్.. వంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్పై నిషేధాన్ని ఎత్తివేసిన సందర్భంగా విమానాశ్రయంలో మహ్మద్ బిన్ రషీద్..కాసేపు కలియతిరిగారు. ఈ సందర్భంగా ప్రయాణికులతో మాట్లాడారు. పిల్లలను దగ్గరకు తీసుకుని ఫోటోలు దిగారు. స్వయంగా రాజే అనుకోకుండా కనిపించడంతో అక్కడ ఉన్నవారంతా సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









