దుబాయి ఎయిర్‌పోర్ట్‌లో షేక్ హందాన్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్

- July 07, 2017 , by Maagulf
దుబాయి ఎయిర్‌పోర్ట్‌లో షేక్ హందాన్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్

దుబాయ్ : యూఏఈ ప్రధానమంత్రి, వైస్ ప్రెసిడెంట్  మరియు దుబాయ్ యొక్క పాలకుడు శ్రీశ్రీ  షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తోయం గురువారం ఆకస్మికంగా దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 3 ను సందర్శించారు.ఈ సందర్భంగా ప్రయాణీకుల రద్దీ ప్రవాహాన్ని సమీక్షించి, వారికి అందించబడుతున్న సౌకర్యాల గూర్చి వాకబు చేశారు.తన పర్యటనను కాంకోర్స్ 3 లో బయలుదేరే హాల్ వద్ద ప్రారంభించారు, అక్కడ అతను ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ చెక్-ఇన్ కౌంటర్లు, సామాను-పరిశీలన సౌకర్యాలు మరియు పాస్పోర్ట్ కౌంటర్లు వద్ద ఆగి పాస్పోర్ట్ అధికారులతో సంప్రదించారు, ప్రయాణీకులను మర్యాదతో గౌరవించమని వారిని కోరారు  వివిధ కారణాల రీత్యా విదేశాలకు వెళ్లేందుకు దుబాయి ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన యూఏఈ పౌరులంతా.. ఒక్కసారిగా తమ కళ్ల ముందు కనిపించిన దృశ్యాన్ని చూసి నమ్మలేకపోయారు. దుబాయి రారు, యూఏఈ ప్రధానమంత్రి షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ దుబాయి ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యేక పర్యటన చేశారు. దుబాయి నుంచి అమెరికాకు వెళ్లే విమానాల్లో ల్యాప్‌టాప్, టాబ్స్.. వంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌పై నిషేధాన్ని ఎత్తివేసిన సందర్భంగా విమానాశ్రయంలో మహ్మద్ బిన్ రషీద్..కాసేపు కలియతిరిగారు. ఈ సందర్భంగా ప్రయాణికులతో మాట్లాడారు. పిల్లలను దగ్గరకు తీసుకుని ఫోటోలు దిగారు. స్వయంగా రాజే అనుకోకుండా కనిపించడంతో అక్కడ ఉన్నవారంతా సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com