ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్కు సాక్షి మాలిక్ మరియు వినీశ్ ఫొగట్
- July 08, 2017
అగ్రశ్రేణి మహిళా రెజ్లర్లు రియో ఒలింపిక్ కాంస్య పతక విజేత సాక్షి మాలిక్, ఆసియా ఛాంపియన్షిప్ విజేత వినీశ్ ఫొగట్ ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్కు ఎంపికయ్యారు. ఫ్రాన్స్ రాజధాని పారిస్లో వచ్చే నెలలో ఈ పోటీలు జరగను న్నాయి. భారత రెజ్లింగ్ సమాఖ్య లఖ్నవూలో ఆయా విభాగాల్లో ట్రయల్స్ నిర్వహించి భారత తరుపున పోటీదారులను ఎంపిక చేశారు. రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత (58కెజీలు), ఆసియా ఛాంపియన్ షిప్ (60కెజీలు) రజత పతక విజేత సాక్షి మాలిక్ ఈపోటీలకు ఎంపికైంది. ఆసియా ఛాంపియన్స్షిప్లో రజతం కైవసం చేసుకున్న వినీశ్ ఫొగట్ (48కేజీల) విభాగంలో బరిలోకి దిగనుంది. శ్రీతల్ 53కిలోల విభాగంలో, పూజా దండ 58కెజీల, శిల్పి 63కిలోల, నవజోత్ కౌర్ 69కిలోల, పూజ 75కేజీల విభాగాల్లో ప్రపంచ ఛాంపి యన్ షిప్కు ఎంపికయ్యారు. గీతాఫొగట్, బబితా ఫొగట్ ట్రయల్స్లో పాల్గొనలేదు. రితు, సంతీత ఫొగట్ అర్హత సాధించలేక పోయారు.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







