ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్కు సాక్షి మాలిక్ మరియు వినీశ్ ఫొగట్
- July 08, 2017
అగ్రశ్రేణి మహిళా రెజ్లర్లు రియో ఒలింపిక్ కాంస్య పతక విజేత సాక్షి మాలిక్, ఆసియా ఛాంపియన్షిప్ విజేత వినీశ్ ఫొగట్ ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్కు ఎంపికయ్యారు. ఫ్రాన్స్ రాజధాని పారిస్లో వచ్చే నెలలో ఈ పోటీలు జరగను న్నాయి. భారత రెజ్లింగ్ సమాఖ్య లఖ్నవూలో ఆయా విభాగాల్లో ట్రయల్స్ నిర్వహించి భారత తరుపున పోటీదారులను ఎంపిక చేశారు. రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత (58కెజీలు), ఆసియా ఛాంపియన్ షిప్ (60కెజీలు) రజత పతక విజేత సాక్షి మాలిక్ ఈపోటీలకు ఎంపికైంది. ఆసియా ఛాంపియన్స్షిప్లో రజతం కైవసం చేసుకున్న వినీశ్ ఫొగట్ (48కేజీల) విభాగంలో బరిలోకి దిగనుంది. శ్రీతల్ 53కిలోల విభాగంలో, పూజా దండ 58కెజీల, శిల్పి 63కిలోల, నవజోత్ కౌర్ 69కిలోల, పూజ 75కేజీల విభాగాల్లో ప్రపంచ ఛాంపి యన్ షిప్కు ఎంపికయ్యారు. గీతాఫొగట్, బబితా ఫొగట్ ట్రయల్స్లో పాల్గొనలేదు. రితు, సంతీత ఫొగట్ అర్హత సాధించలేక పోయారు.
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







