ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్కు సాక్షి మాలిక్ మరియు వినీశ్ ఫొగట్
- July 08, 2017
అగ్రశ్రేణి మహిళా రెజ్లర్లు రియో ఒలింపిక్ కాంస్య పతక విజేత సాక్షి మాలిక్, ఆసియా ఛాంపియన్షిప్ విజేత వినీశ్ ఫొగట్ ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్కు ఎంపికయ్యారు. ఫ్రాన్స్ రాజధాని పారిస్లో వచ్చే నెలలో ఈ పోటీలు జరగను న్నాయి. భారత రెజ్లింగ్ సమాఖ్య లఖ్నవూలో ఆయా విభాగాల్లో ట్రయల్స్ నిర్వహించి భారత తరుపున పోటీదారులను ఎంపిక చేశారు. రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత (58కెజీలు), ఆసియా ఛాంపియన్ షిప్ (60కెజీలు) రజత పతక విజేత సాక్షి మాలిక్ ఈపోటీలకు ఎంపికైంది. ఆసియా ఛాంపియన్స్షిప్లో రజతం కైవసం చేసుకున్న వినీశ్ ఫొగట్ (48కేజీల) విభాగంలో బరిలోకి దిగనుంది. శ్రీతల్ 53కిలోల విభాగంలో, పూజా దండ 58కెజీల, శిల్పి 63కిలోల, నవజోత్ కౌర్ 69కిలోల, పూజ 75కేజీల విభాగాల్లో ప్రపంచ ఛాంపి యన్ షిప్కు ఎంపికయ్యారు. గీతాఫొగట్, బబితా ఫొగట్ ట్రయల్స్లో పాల్గొనలేదు. రితు, సంతీత ఫొగట్ అర్హత సాధించలేక పోయారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









