మృతదేహాల తరలింపు: 48 గంటల నోటీస్‌ హాస్యాస్పదం

- July 11, 2017 , by Maagulf
మృతదేహాల తరలింపు: 48 గంటల నోటీస్‌ హాస్యాస్పదం

కాలికట్‌ ఎయిర్‌పోర్ట్‌ హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ జలాలుద్దీన్‌, మృతదేహాల్ని తరలించేందుకు ఎయిర్‌లైన్స్‌ సంస్థలు 48 గంటలు ముందుగా సమాచారం ఇవ్వాలంటూ జారీ చేసిన సర్క్యులర్‌ వివాదాస్పదమయ్యింది. ఇది సాధ్యం కాని విషయంగా ఇండియన్‌ ఎంబసీ మరియు సోషల్‌ యాక్టివిస్టులు పేర్కొంటున్నారు. గల్ఫ్‌ దేశాల నుంచి మృతదేహాల్ని స్వదేశానికి తరలించే క్రమంలో చాలా ఇబ్బందులు ఎదురవుతుంటాయనీ, వీటికి తోడు కొత్తగా ఈ 48 గంటల నోటీసు సమస్యను మరింత తీవ్రతరం చేస్తుందని వారంటున్నారు. అయితే జారీ చేసిన సర్క్యులర్‌ వెనుక ఉద్దేశ్యం వేరే ఉందనీ, దేశంలోకి ఇన్‌ఫెక్చువస్‌ డిసీజెస్‌ రాకుండా ఉండేందుకే తప్ప, మృతదేహాల్ని అడ్డుకునే ఆలోచన లేదని డాక్టర్‌ జలాలుద్దీన్‌ చెప్పారు. ఇంకో వైపున కేరళ ముఖ్యమంత్రి కూడా కేంద్రానికి ఈ విషయమై ప్రత్యేక విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రస్తుతానికి జలాలుద్దీన్‌ పంపిన సర్క్యులర్‌ ఒక్క షార్జా ఎయిర్‌పోర్ట్‌కి మాత్రమే చేరింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com