మృతదేహాల తరలింపు: 48 గంటల నోటీస్ హాస్యాస్పదం
- July 11, 2017
కాలికట్ ఎయిర్పోర్ట్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ జలాలుద్దీన్, మృతదేహాల్ని తరలించేందుకు ఎయిర్లైన్స్ సంస్థలు 48 గంటలు ముందుగా సమాచారం ఇవ్వాలంటూ జారీ చేసిన సర్క్యులర్ వివాదాస్పదమయ్యింది. ఇది సాధ్యం కాని విషయంగా ఇండియన్ ఎంబసీ మరియు సోషల్ యాక్టివిస్టులు పేర్కొంటున్నారు. గల్ఫ్ దేశాల నుంచి మృతదేహాల్ని స్వదేశానికి తరలించే క్రమంలో చాలా ఇబ్బందులు ఎదురవుతుంటాయనీ, వీటికి తోడు కొత్తగా ఈ 48 గంటల నోటీసు సమస్యను మరింత తీవ్రతరం చేస్తుందని వారంటున్నారు. అయితే జారీ చేసిన సర్క్యులర్ వెనుక ఉద్దేశ్యం వేరే ఉందనీ, దేశంలోకి ఇన్ఫెక్చువస్ డిసీజెస్ రాకుండా ఉండేందుకే తప్ప, మృతదేహాల్ని అడ్డుకునే ఆలోచన లేదని డాక్టర్ జలాలుద్దీన్ చెప్పారు. ఇంకో వైపున కేరళ ముఖ్యమంత్రి కూడా కేంద్రానికి ఈ విషయమై ప్రత్యేక విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రస్తుతానికి జలాలుద్దీన్ పంపిన సర్క్యులర్ ఒక్క షార్జా ఎయిర్పోర్ట్కి మాత్రమే చేరింది.
తాజా వార్తలు
- ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవలకు అంతరాయం
- తిరుపతిలో NDA కూటమి విజయోత్సవ సభ
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్
- సైబర్ నేరాల ఛేదనకు AI అస్త్రం: డీజీపీ సి.వి.ఆనంద్
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం









