మృతదేహాల తరలింపు: 48 గంటల నోటీస్ హాస్యాస్పదం
- July 11, 2017
కాలికట్ ఎయిర్పోర్ట్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ జలాలుద్దీన్, మృతదేహాల్ని తరలించేందుకు ఎయిర్లైన్స్ సంస్థలు 48 గంటలు ముందుగా సమాచారం ఇవ్వాలంటూ జారీ చేసిన సర్క్యులర్ వివాదాస్పదమయ్యింది. ఇది సాధ్యం కాని విషయంగా ఇండియన్ ఎంబసీ మరియు సోషల్ యాక్టివిస్టులు పేర్కొంటున్నారు. గల్ఫ్ దేశాల నుంచి మృతదేహాల్ని స్వదేశానికి తరలించే క్రమంలో చాలా ఇబ్బందులు ఎదురవుతుంటాయనీ, వీటికి తోడు కొత్తగా ఈ 48 గంటల నోటీసు సమస్యను మరింత తీవ్రతరం చేస్తుందని వారంటున్నారు. అయితే జారీ చేసిన సర్క్యులర్ వెనుక ఉద్దేశ్యం వేరే ఉందనీ, దేశంలోకి ఇన్ఫెక్చువస్ డిసీజెస్ రాకుండా ఉండేందుకే తప్ప, మృతదేహాల్ని అడ్డుకునే ఆలోచన లేదని డాక్టర్ జలాలుద్దీన్ చెప్పారు. ఇంకో వైపున కేరళ ముఖ్యమంత్రి కూడా కేంద్రానికి ఈ విషయమై ప్రత్యేక విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రస్తుతానికి జలాలుద్దీన్ పంపిన సర్క్యులర్ ఒక్క షార్జా ఎయిర్పోర్ట్కి మాత్రమే చేరింది.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







