ఇండియన్ వర్కర్స్ కోసం కొత్త సపోర్ట్ సెంటర్
- July 11, 2017
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అతి త్వరలో షార్జాలోని భారత కార్మికుల కోసం వెల్ఫేర్ సెంటర్ని ఏర్పాటు చేయనున్నట్లు యూఏఈలో ఇండియన్ అంబాసిడర్ నవ్దీప్ సింగ్ సూరి చెప్పారు. షార్జాలో ప్రారంభించే ఇండియన్ వర్కర్స్ రిసోర్స్ సెంటర్ (ఐడబ్ల్యుఆర్సి) రెండో కేంద్రం. మొదటి ఐడబ్ల్యుఆర్సి, దుబాయ్లో 2010లో ప్రారంభించారు. ప్రస్తుతం 2.6 మిలియన్ భారత వలసదారులకు యూఏఈలో ఈ కేంద్రం సేవలు అందిస్తోంది. ప్రభుత్వం నుంచి అప్రూవల్స్ వచ్చాయనీ, కొత్త సెంటర్ ఏర్పాటు పనులు జరుగుతున్నాయని నవ్దీప్ సింగ్ సూరి చెప్పారు. ప్రస్తుతానికి కొత్త సెంటర్ తాలూకు లొకేషన్ ఖచ్చితంగా చెప్పలేమని, షార్జాతోపాటు సమీప ప్రాంతాల్లో ఉన్నవారికి ఈ కేంద్రం వీలుగా ఉంటుందని మాత్రం చెప్పగలమని ఆయన తెలిపారు. దుబాయ్ సెంటర్ అందిస్తున్న సేవలన్నీ షార్జా సెంటర్లో కల్పిస్తామని వివరించారాయన. 2017 తొలి ఆరు నెలల్లో దుబాయ్ సెంటర్ 11,700 కాల్స్ అందుకుందనీ, 640 మంది సందర్శించారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఐడబ్ల్యుఆర్సి 589 లీగల్ కౌన్సిలింగ్ సెషన్స్ని, 31 పర్సనల్ కౌన్సిలింగ్ సెషన్స్ని, 33 ఫైనాన్షియల్ కౌన్సిలింగ్ సెషన్స్నీ నిర్వహించింది.
తాజా వార్తలు
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!









