ఇండియన్ వర్కర్స్ కోసం కొత్త సపోర్ట్ సెంటర్
- July 11, 2017
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అతి త్వరలో షార్జాలోని భారత కార్మికుల కోసం వెల్ఫేర్ సెంటర్ని ఏర్పాటు చేయనున్నట్లు యూఏఈలో ఇండియన్ అంబాసిడర్ నవ్దీప్ సింగ్ సూరి చెప్పారు. షార్జాలో ప్రారంభించే ఇండియన్ వర్కర్స్ రిసోర్స్ సెంటర్ (ఐడబ్ల్యుఆర్సి) రెండో కేంద్రం. మొదటి ఐడబ్ల్యుఆర్సి, దుబాయ్లో 2010లో ప్రారంభించారు. ప్రస్తుతం 2.6 మిలియన్ భారత వలసదారులకు యూఏఈలో ఈ కేంద్రం సేవలు అందిస్తోంది. ప్రభుత్వం నుంచి అప్రూవల్స్ వచ్చాయనీ, కొత్త సెంటర్ ఏర్పాటు పనులు జరుగుతున్నాయని నవ్దీప్ సింగ్ సూరి చెప్పారు. ప్రస్తుతానికి కొత్త సెంటర్ తాలూకు లొకేషన్ ఖచ్చితంగా చెప్పలేమని, షార్జాతోపాటు సమీప ప్రాంతాల్లో ఉన్నవారికి ఈ కేంద్రం వీలుగా ఉంటుందని మాత్రం చెప్పగలమని ఆయన తెలిపారు. దుబాయ్ సెంటర్ అందిస్తున్న సేవలన్నీ షార్జా సెంటర్లో కల్పిస్తామని వివరించారాయన. 2017 తొలి ఆరు నెలల్లో దుబాయ్ సెంటర్ 11,700 కాల్స్ అందుకుందనీ, 640 మంది సందర్శించారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఐడబ్ల్యుఆర్సి 589 లీగల్ కౌన్సిలింగ్ సెషన్స్ని, 31 పర్సనల్ కౌన్సిలింగ్ సెషన్స్ని, 33 ఫైనాన్షియల్ కౌన్సిలింగ్ సెషన్స్నీ నిర్వహించింది.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







