భట్వాని
- July 13, 2017కావలసినవి: బ్లాక్ సోయాబీన్ - 250 గ్రాములు, బియ్యప్పిండి - కొద్దిగా ,ఎండు మిర్చి (వేగించి) - నాలుగు, వెల్లుల్లి రెబ్బలు,(తరిగి) - ఐదు రెబ్బలు, పసుపు - ఒక టీస్పూన్, గరం మసాలా - ఒక టీస్పూన్, ఉప్పు - రుచికి సరిపడాఆవ నూనె - నాలుగు టేబుల్ స్పూన్లు
తయారీ: ఒక టేబుల్ స్పూన్ ఆవనూనెను పాన్లో వేసి వేడిచేయాలి. సోయాబీన్ గింజలు వేసి అవి చిటపటమనేవరకు వేగించాలి. గింజలు వేడిగా ఉండగానే వాటిని నలగ్గొట్టాలి. ఇందులో బియ్యప్పిండి కలపాలి. స్టవ్ మీద పాన్ పెట్టి మిగిలిన ఆవనూనె వేడిచేయాలి. నూనె వేడెక్కగానే వెల్లుల్లి తరుగు కాసేపు వేగించాలి. బియ్యప్పిండి, సోయాబీన్ల మిశ్రమాన్ని పాన్లో వేసి పసుపు, గరం మసాల, ఉప్పు వేసి ఉడికించాలి. వేడివేడి అన్నంతో తింటే రుచిగా ఉంటుంది. పక్కన వేగించిన ఎండుమిర్చిని నంజుకు తింటే బాగుంటుంది.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..