రాయల్ బహ్రెయిన్ హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్ ప్రారంభం
- July 14, 2017
రాయల్ బహ్రెయిన్ హాస్పిటల్ (ఆర్బిహెచ్)లో డయాలసిస్ కేంద్రం ప్రారంభమయ్యింది. 2017 జులై నుంచి ఈ సెంటర్లో రోగులకు సేవలందుతున్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ నెఫ్రాలజీ దీన్ని నిర్వహిస్తోంది. 2 బెడెడ్ ఫెసిలిటీలో హిమోడయాలసిస్ సేవలు అందుతున్నాయి. ఆర్బిహెచ్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ నదెర్ అల్బర్ట్ హన్నా ఈ కేంద్రానికి నేతృత్వం వహిస్తున్నారు. కైరోలోని ఇంటర్నల్ మెడిసిన్లో డాక్టర్ నదెర్ డాక్టరేట్ డిగ్రీ పొంది ఉన్నారు. ఈజిపిస్టన్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీ మరియు రాయల్ కాలేజ్ ఆప్ సర్జన్స్ - ఐర్లాండ్లో సభ్యుడిగా పనిచేస్తున్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఈ డయాలసిస్ సెంటర్ ఎంతో ఉపకరిస్తుందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. డయాబెటిస్, హై బ్లడ్ ప్రెజర్ కారణంగా కిడ్నీ సమస్యలు తీవ్రతరమవుతాయని వైద్యులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!









