యూఏఈలో మండుతున్న ఎండలు

- July 14, 2017 , by Maagulf
యూఏఈలో మండుతున్న ఎండలు

రానున్న 24 గంటల్లో ఉష్ణోగ్రతలు 49 డిగ్రీలకు చేరుకోవచ్చని ఎన్‌సిఎంఎస్‌ హెచ్చరించింది. ఉష్ణోగ్రతలు తీవ్రతరమవడంతోపాటుగా ఉక్కపోత ఎక్కువగా ఉంటుందనీ, కొన్ని చోట్ల సాయంత్రం వేళ ఆకాశం మేఘావృతమవ్వొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. గాలులు ఓ మోస్తరు నుంచి సాధారణంగా ఉండొచ్చు. ధూళితో కూడిన గాలుల కారణంగా వాహనదారులకు సమస్యలు ఏర్పడవచ్చు. కొన్ని ప్రాంతాల్లో పొగమంచు దర్శనమిచ్చే అవకాశాలు ఉన్నాయి. రానున్న 48 గంటలపాటు ఇదే వాతావరణ పరిస్థితులు ఉండవచ్చును గనుక వాహనదారులు, ప్రజలు ఒకింత అప్రమత్తంగా ఉండాల్సిందేనని నిపుణులు పేర్కొంటున్నారు. సముద్రం కొంతమేర రఫ్‌గా ఉండొచ్చు కాబట్టి, సముద్ర తీర ప్రాంతాల్లో సేద తీరుదామనుకునేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com