తమిళ్ హీరో శరత్ కుమార్ కు రూ. 2 లక్షల ఫైన్
- July 18, 2017
నటుడు శరత్కుమార్కి కష్టాలు రెట్టింపయ్యాయి. తనఖాపెట్టిన ఆస్తిని విక్రయించడానికి యత్నించిన వ్యవహారంలో ఆయనకు మద్రాస్ హైకోర్టు రూ.2 లక్షల జరిమానా విధించింది. తమపై దాఖలైన పిటిషన్ను తోసిపుచ్చాలంటూ శరత్కుమార్ వేసిన పిటిషన్ను విచారణకు అనుమతించలేదు న్యాయస్థానం.
శరత్కుమార్, ఆయన వైఫ్ రాధిక భాగస్వాములుగావున్న మ్యాజిక్ ఫ్రేమ్స్ సంస్థ 'ఇదు ఎన్న మాయం' అనే ఫిల్మ్ని తెరకెక్కించింది. దీని నిర్మాణం కోసం.. రాడియన్స్ సంస్థ నుంచి 2014లో శరత్కుమార్ రూ.1.50 కోట్ల అప్పు తీసుకున్నాడు. ఈ అప్పుని మరుసటి ఏడాది మార్చిలోపు చెల్లిస్తానని, లేనిపక్షంలో టీవీ హక్కులు, తర్వాత నిర్మించబోయే ఫిల్మ్ హక్కులను రాడియన్స్ సంస్థకు అందించనున్నట్టు హామీ ఇచ్చాడు. ఆ తర్వాత రూ. కోటి రుణం అదనంగా తీసుకుని పూచీగా ఆస్తులను తనఖా పెట్టాడు. ఐతే, ఒప్పందాన్ని అతిక్రమించి సినిమా విడుదల చేశాడట ఈ నటుడు. తనఖా పెట్టిన ఆస్తులను విక్రయించడానికి యత్నించాడని, అలాగే తమ నుంచి తీసుకున్న రెండున్నర కోట్లకు వడ్డీ చెల్లించాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో రాడియన్స్ సంస్థ పిటిషన్ వేసింది.
దీనిపై స్పందించిన న్యాయస్థానం, ఆగస్ట్ 15లోపు రూ.2 లక్షల జరిమానా చెల్లించాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







