హైదరాబాద్ లో 30న డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ర్యాలీ

- July 19, 2017 , by Maagulf
హైదరాబాద్ లో 30న డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ర్యాలీ

కళామందిర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌ కేబీఆర్‌ పార్కు వద్ద ఈ నెల 30న డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించనున్నట్టు కళామందిర్‌ కల్యాణ్‌ తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను ఎక్సైజ్‌ ఎన్ ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ అకున సబర్వాల్‌తో కలిసి ఆయన బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా కల్యాణ్‌ మాట్లాడుతూ డ్రగ్స్‌ సంస్కృతి పాఠశాలలకు కూడా పాకడం బాధాకరమని అన్నారు. ఎంతో భవిష్యత ఉన్న విద్యార్థులను, యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. తమ వంతుగా డ్రగ్స్‌ గురించి అందరికి అవగాహన కలిగించేందుకు కృషి చేస్తున్నామన్నారు. దీనిలో భాగంగానే స్కూల్‌, కళాశాల విద్యార్థులతో కలిసి నిర్వహించే ఈ ర్యాలీకి అకున్‌ సబర్వాల్‌ కూడా హాజరుకానున్నట్లు చెప్పారు. డ్రగ్స్‌ తీసుకోవడం వల్ల ఎదురయ్యే మానసిక, ఆరోగ్య ఇబ్బందులను తెలియచేస్తూ బుక్‌లెట్‌ కూడా విడుదల చేయనున్నట్టు తెలిపారు. హోప్‌ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. 30న ర్యాలీకి నగరవాసులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కల్యాణ్‌ కోరారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com