ఎన్నారై టిఆర్ఎస్ సెల్ బహ్రెయిన్ వారిచే హరితహారం పోస్టర్స్ విడుదల
- July 20, 2017
ఎన్నారై టిఆర్ఎస్ సెల్ బహ్రెయిన్ హరితహారం డోర్ స్టికర్ పోస్టర్స్ ను ఆవిష్కరించిన మార్క్ఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డి.
జగిత్యాల జిల్లా కథలపూర్ మండలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూడో విడత ఆకుపచ్చ హరితహారం రాష్ట్రానికి మణిహారంగా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది దీనిని విజయవంతం చేసేందుకు నాయకులు కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు అందరు భాగస్వాములు కావాలని మార్క్ఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డి దిశానిర్దేశం చేశారు. అనంతరం భూషణరావుపేట లోక బాపురెడ్డి నివాసంలో నిర్వహించిన తెరాస మండలస్థాయి హరితహారం సమావేశంలో బాగంగా ప్రతి గ్రామ పంచాయతీలలో ప్రతిఒక్కరు మొక్కలు నాటలంటు ప్రజలలో అవగాహన పెంచెందుకు మన మండలానికి చెందిన బహ్రెయిన్ ఎన్నారై టిఆర్ఎస్ సెల్ సభ్యులు, సిరికొండ రాధారపు సతీష్ కుమార్ మరియు ఊట్ పల్లి కి చెందిన బోలిశెట్టి వెంకటేష్ లు ప్రజలలో అవగాహన పెంచెందుకు రూపొందించిన డోర్ స్టికర్ పోస్టర్లను మార్క్ఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డి చేతుల మీదుగా గురువారం నాడు ఆవిష్కరించి వారు చేస్తున్న కార్యక్రమాలను అభినందించి అనందం వక్తం చేశారు. ఈ సందర్భంగా మన సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ చక్కటి హరితహారం కార్యక్రమం ద్వారా భావితరాలకు ఎంతో మేలు చేకూరనుందని ప్రతిఒక్కరూ భాగస్వాములై పెద్ద ఎత్తున మొక్కలు నాటి వాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని లోక బాపురెడ్డి వివరించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీఆర్ఎస్ మండల అధ్యక్షులు నాగం భూమయ్య, వర్ధినేని నాగేశ్వర్రావు, నాంపెల్లి లింబాద్రి, ఏజీబి మహేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
--యం.వాసు దేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







