రిలయన్స్ jio వారి కొత్త స్మార్ట్ ఫోన్ రేట్ మాత్రం సస్పెన్సు
- July 21, 2017
అనుకున్నట్టుగానే రిలయన్స్ జియో సరికొత్త ఫోన్ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. 'ఇండియా కా స్మార్ట్ ఫోన్' పేరుతో దీన్ని ప్రవేశపెట్టారు. ఇందులో అనేక ఫీచర్లు ఉన్నాయి. శుక్రవారం జరిగిన రిలయెన్స్ 40వ వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా ఈ స్మార్ట్ ఫోన్ను ప్రవేశపెట్టింది.
కాగా, ఈ సందర్భంగా ఆ సంస్థ అధినేత ముకేష్ అంబానీ కంటతడి పెట్టారు. ఈ 40 ఏళ్లలో రిలయెన్స్ సాధించిన ప్రగతిని చెబుతుండగా ఆయన కంటతడిపెట్టారు. అలాగే, ప్రేక్షకుల్లో ఉన్న ఆయన తల్లి కూడా విలపించారు. 1977లో వస్త్రవ్యాపారం నుంచి ఇప్పుడు ఎన్నో రంగాల్లోకి విస్తరించినట్లు అంబానీ చెప్పారు.
ప్రస్తుతం రిలయెన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5 లక్షల కోట్లకు చేరిందని ఆయన వెల్లడించారు. 1977లో రూ.3 కోట్లుగా ఉన్న సంస్థ టర్నోవర్ పది వేల రెట్లు పెరిగి రూ.30 వేల కోట్లకు చేరిందని తెలిపారు. 3500 ఉన్న ఉద్యోగులు రెండున్నర లక్షలకు చేరారని చెప్పారు. ఇక వెయ్యి ఉన్న షేరు ధర రూ. 16.5 లక్షలకు చేరిందని ఆయన తెలిపారు. ప్రతి ఒక్క నిమిషానికి ఏడుగురు కష్టమర్లు జియో కుటుంబంలో చేరుతున్నట్టు తెలిపారు.
తాజా వార్తలు
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!









