రిలయన్స్ jio వారి కొత్త స్మార్ట్ ఫోన్ రేట్ మాత్రం సస్పెన్సు
- July 21, 2017
అనుకున్నట్టుగానే రిలయన్స్ జియో సరికొత్త ఫోన్ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. 'ఇండియా కా స్మార్ట్ ఫోన్' పేరుతో దీన్ని ప్రవేశపెట్టారు. ఇందులో అనేక ఫీచర్లు ఉన్నాయి. శుక్రవారం జరిగిన రిలయెన్స్ 40వ వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా ఈ స్మార్ట్ ఫోన్ను ప్రవేశపెట్టింది.
కాగా, ఈ సందర్భంగా ఆ సంస్థ అధినేత ముకేష్ అంబానీ కంటతడి పెట్టారు. ఈ 40 ఏళ్లలో రిలయెన్స్ సాధించిన ప్రగతిని చెబుతుండగా ఆయన కంటతడిపెట్టారు. అలాగే, ప్రేక్షకుల్లో ఉన్న ఆయన తల్లి కూడా విలపించారు. 1977లో వస్త్రవ్యాపారం నుంచి ఇప్పుడు ఎన్నో రంగాల్లోకి విస్తరించినట్లు అంబానీ చెప్పారు.
ప్రస్తుతం రిలయెన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5 లక్షల కోట్లకు చేరిందని ఆయన వెల్లడించారు. 1977లో రూ.3 కోట్లుగా ఉన్న సంస్థ టర్నోవర్ పది వేల రెట్లు పెరిగి రూ.30 వేల కోట్లకు చేరిందని తెలిపారు. 3500 ఉన్న ఉద్యోగులు రెండున్నర లక్షలకు చేరారని చెప్పారు. ఇక వెయ్యి ఉన్న షేరు ధర రూ. 16.5 లక్షలకు చేరిందని ఆయన తెలిపారు. ప్రతి ఒక్క నిమిషానికి ఏడుగురు కష్టమర్లు జియో కుటుంబంలో చేరుతున్నట్టు తెలిపారు.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







