విల్లాలో అగ్ని ప్రమాదం: మెయిడ్ మృతి
- July 21, 2017
ఓ ఎలుక, గ్యాస్ సిలిండర్కి ఉన్న వైర్ని కొరికెయ్యడంతో గ్యాస్ లీక్ అయ్యి, మంటలు చెలరేగగా, ఆసియాకి చెందిన 32 ఏళ్ళ మెయిడ్ మృతి చెందింది. గ్యాస్ లీక్ అయిన వాసన పసిగట్టిన యజమాని, స్టవ్ని వెలిగించవద్దంటూ మెయిడ్ని హెచ్చరించినా, ఆమెకు అర్థం కాకపోవడంతో ఆమె కిచెన్లోకి వెళ్ళగానే ప్రమాదం చోటు చేసుకుంది. గ్యాస్ లీక్ వల్ల సంభవించిన పేలుడు ధాటికి గోడ ధ్వంసమయ్యింది. తీవ్ర గాయాలతో మెయిడ్ అక్కడికక్కడే చనిపోయింది. ఘటన గురించిన సమాచారం అందుకోగానే సివిల్ డిఫెన్స్ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుంది. ఎలుకల కారణంగా ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయనీ, అందుకే ఎలుకలతో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సివిల్ డిఫెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఇలాంటి ఘటనలు గతంలోనూ దుబాయ్లో చోటు చేసుకున్నాయి.
తాజా వార్తలు
- శ్రీలంక పై న్యూజిలాండ్ విజయం
- సైబరాబాద్లో ‘ఏఐ’ ట్రాఫిక్ మంత్రం
- ఇజ్రాయెల్ పార్లమెంట్లో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..
- జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి నీళ్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు
- నెతన్యాహు ఘన స్వాగతం, మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్!
- గుడ్ న్యూస్..భారత్ కు వెనిజులా ఆయిల్ వచ్చేస్తోంది!
- ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యం
- లోక్ భవన్లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు









